Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభిషేక్ రావు కస్టడీ పొడగింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Rao’s custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది. అయితే మరికొంత సమయం కావాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Read Also: Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది సీబీఐ, ఈడీ. అభిషేక్ రావును మూడు రోజుల పాటు ఈడీ విచారించింది. ఈ స్కామ్ లో రామచంద్ర అరుణ్ పిళ్లైని విచారించిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైతో అభిషేక్ రావుకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైకి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయితే ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండటంతో, అతని కూతురు అనారోగ్యం కారణంగా పిళ్లై హాజరుకాలేదని సీబీఐ, కోర్టుకు తెలిపింది. మరికొన్ని ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కస్టడీ అవసరం లేదని.. ఈ కేసులో కస్టడీ లేకుండా విచారించవచ్చని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తున్నామని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఎక్సైజ్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్ కు కారణం అయింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. పలుమార్లు సిసోడియాకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లు, బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది సీబీఐ. ఈ కేసులో తెలంగాణలోని కొంతమంది పారశ్రామికవేత్తల ప్రమేయం ఉందని.. హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!