Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభిషేక్ రావు కస్టడీ పొడగింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Rao’s custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది. అయితే మరికొంత సమయం కావాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Read Also: Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది సీబీఐ, ఈడీ. అభిషేక్ రావును మూడు రోజుల పాటు ఈడీ విచారించింది. ఈ స్కామ్ లో రామచంద్ర అరుణ్ పిళ్లైని విచారించిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైతో అభిషేక్ రావుకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైకి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయితే ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండటంతో, అతని కూతురు అనారోగ్యం కారణంగా పిళ్లై హాజరుకాలేదని సీబీఐ, కోర్టుకు తెలిపింది. మరికొన్ని ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కస్టడీ అవసరం లేదని.. ఈ కేసులో కస్టడీ లేకుండా విచారించవచ్చని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తున్నామని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఎక్సైజ్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్ కు కారణం అయింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. పలుమార్లు సిసోడియాకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లు, బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది సీబీఐ. ఈ కేసులో తెలంగాణలోని కొంతమంది పారశ్రామికవేత్తల ప్రమేయం ఉందని.. హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!