India Assistance To Afghanistan: యుద్దంతో అతలాకుతలం అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి భారత్ మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ ప్రజల కోసం గోధుమలను, వైద్య సామాగ్రిని పంపింది. ఇదిలా ఉంటే మరోసారి వైద్య సహాయాన్ని అందిస్తోంది భారత్. భారత్ గత కొన్ని నెలల్లో 13 బ్యాచుల్లో 45 టన్నుల వైద్య సహాయాన్ని అందించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం భారత్ సహాయాన్ని కొనాసాగిస్తుందని వెల్లడించింది. పీడీయాట్రిక్ స్టెతస్కోప్, బీపీ మిషన్లు,
Hindu girl abducted in Pakistan's Sindh, fourth incident in 15 days: పాకిస్తాన్ దేశంలో హిందూ బాలికలు, యువతుల కిడ్నాపులు, పెళ్లిళ్లు చేసుకుని బలవంతపు మతమార్పులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ బాలిక కిడ్నాపుకు గురైంది. గత 15 రోజుల్లో ఇది నాలుగో ఘటన. పాకిస్తాన్ జనాభాలో 3.5 శాతం మాత్రమే ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారు. వీరంతా బలవంతపు మతమార్పిడులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బలవంతపు మతమార్పుడులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును పాకిస్తాన్న పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది. అంటే…
How Did Wipro Catch 300 "Moonlighters": వర్క్ ఫ్రం హోం అదనుగా పలువురు ఐటీ జాబ్స్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాయి టెక్ దిగ్గజ కంపెనీలు విప్రో, ఐబీఎం, ఇన్ఫోసిస్. ఇకపై తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘మూన్ లైటింగ్’ విధానంలోొ రెండు జాబ్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి. మూన్ లైటింగ్ చేస్తున్నారని తెలిస్తే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. ఇక మిగతా ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు రెండు…
Human sacrifice of two young women in Kerala: డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు.
CJI UU Lalit recommends Justice D Y Chandrachud as next Chief Justice of India: భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ తన వారసుడిగా కేంద్రానికి పేరును సూచించారు. దీనిపై కేంద్రన్యాయశాఖకు జస్టిస్ లలిత్ లేఖ రాయనున్నారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు కేంద్రం తదుపరి సీజేఐ పేరును సూచించాలి లేఖ రాసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న…
Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ మొదలైంది.
PM Modi's tweet on Puneeth Rajkumar's last film: దివంగత సినీ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘ గంధాడ గుడి’పై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గంధాడ గుడి సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది మరణించిన కన్నడు నటుడు పునీత్ రాజ్ కుమార్ ను స్మరిస్తూ.. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా పునీత్ రాజ్ కుమార్ భార్య రీట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ లో ‘‘…
Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కరెంట్ షాక్ కు గురైంది.
Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్ రాజుగా ఉన్నారని.. తయన పార్టీ పన్నులు…
MK Stalin Elected As DMK Chief For 2nd Time: ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహిాంచిన స్టాలిన్.. వరసగా రెండో సారి కూడా పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం చెన్నైలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన్న పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగనన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీకి సంబంధించిన కీలక పదవులను ముగ్గురు నేతలు…