Sushil Kumar: ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్పై హత్యానేర విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olympian Sushil Kumar To Face Murder Trial For Junior Wrestler’s Death: మే 2021లో మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ మరణించిన కేసులో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యానేర విచారణను ఎదుర్కొనున్నారు. బుధవారం సుశీల్ కుమార్ పై ఢిల్లీ కోర్టు హత్యా నేరాన్ని మోపింది. దీంతో పాటు 17 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై కూడా కోర్టు అభియోగాలను మోపింది.
ఛత్రసాల్ స్టేడియం కేసులో ముండ్కా ప్రాంతంలో గతేడాది మే 23న సుశీల్ కుమార్ తో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదంపై సుశీల్ కుమార్, అతని సహచరులు మే4, మే5 మధ్య రాత్రి జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్, అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్ లపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాగర్ ధంకర్ తర్వాత మరణించాడు. గతేడాది ఆగస్టులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్ లో సుశీల్ కుమార్ తో పాటు 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుశీల్ కుమార్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా హత్య, అపహరణ అభియోగాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టుకు తెలిపారు.
Also Read
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
Read Also: Vande Bharat Train: రేపు నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
గతేడాది మే18న, సుశీల్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ.. ఢిల్లీ రోహిణిలోని కోర్టును ఆశ్రయించాడు. తనపై దర్యాప్తు పక్షపాతంగా జరిగిందని..అయితే కోర్టు మాత్రం అతనికి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సుశీల్ కుమార్ ను ప్రధాన కుట్రదారుగా కోర్టు ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టులో వ్యతిరేకించారు. ఈ కేసులో సాక్షులు సుశీల్ కుమార్, అతని సహచరులను చూసి భయపడుతున్నారని పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరు రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు. 2010లో రెజ్లింగ్ లో ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ లో అనేక సార్లు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు.
సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించాడు.
తాజావార్తలు
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!