సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీరియస్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ అధికారులతో సమావేశానికి సిద్ధం అయ్యారు హోమంత్రి మహమూద్ అలీ.. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి.. ఈ సమావేశంలో బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంపై విశ్లేషించనున్నారు అధికారులు.. ఇక, హైదరాబాద్లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై కూడా రివ్యూ చేయనున్నారు.. మరోవైపు.. […]
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. అయితే, బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్తో పాటు.. అంతర్జాతీయంగా ఆక్షంల నేపథ్యంలో.. రష్యాలోనూ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నీళ్ల ట్యాంకు దగ్గర బిందెల ఫైట్లా కొట్టుకుంటున్నారు. రేషన్ షాపు క్యూలైన్లలో మాదిరి పోట్లాడేసుకుంటున్నారు. తెరవకముందు నుంచే సూపర్ మార్కెట్ల ముందు పడిగాపులు పడి… ఓపెన్ చెయ్యగానే కిందామీదా పడి క్షణాల్లో ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం రష్యాలో పరిస్థితి.. రష్యాలోని ఓ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన […]
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.. ఇక, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు.. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు.. అయితే, వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇవాళ తేనెటీగలు దాడి చేశాయి.. Read Also: AP Assembly: ఎథిక్స్ కమిటీ ముందుకు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం.. మోట కొండూరు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనలు, మరోవైపు సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇది నడుస్తూనే ఉంది.. అయితే, టీడీపీ సభ్యుల వ్యవహార శైలి ఎథిక్స్ కమిటీ ముందుకు చేరింది.. సభలో టీడీపీ సభ్యుల వ్యవహారాల శైలిని పరిశీలించి.. తగిన చర్యలు సూచించనుంది ఎథిక్స్ కమిటీ.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. Read Also: Ukraine Russia War: […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు. […]
మహిళల భద్రత కోసం ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. వారి భద్రత కోసం ప్రత్యేక దిశ పెట్రోలింగ్ వెహికల్స్ను తీసుకొచ్చింది.. సచివాలయంలో దిశ పెట్రోలింగ్ వెహికల్స్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 163 ఫోర్ వీలర్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు.. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా 18 దిశ మొబైల్ విశ్రాంతి వాహనాలు ఏర్పాటు చేశారు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం […]
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. విధించిన లాక్డౌన్లు, ఆంక్షలతో ఎన్నడూ లేని విధంగా కాలుష్యం తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడించాయి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో.. దేశంలో కాలుష్య పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంకటోంది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక, గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 […]
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.. అందులో మొత్తం 12 మంది ఉండగా.. ఓ యువకుడు మాత్రం.. మంటలు చెలరేగిన తర్వాత.. గోడ దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.. కానీ, మరో 11 మంది సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.. ఇక, ఘటనా స్థలాన్ని సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు పరిశీలించారు. […]
మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది. […]