Ambati Rambabu: తన ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసులో విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రెండు ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకుల దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తాను ఫిర్యాదు చేసే వరకూ కేసు నమోదు […]
India anti dumping duty China: ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాల్లో ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.. అయితే, ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం, చైనా నుండి దిగుమతి అవుతున్న చౌక ఎల్ఎన్జీ (LNG) ట్యాంకులపై యాంటీ-డంపింగ్ సుంకాలు విధించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం దేశీయ తయారీదారులను రక్షించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో.. […]
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయబోతున్నారు.. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారిగా పార్లమెంటులో స్పందించనున్న ప్రధాని, దేశానికి సంబంధించిన భద్రతా చర్యలు, భవిష్యత్ సవాళ్లపై వివరించనున్నట్లు సమాచారం. ప్రధాన అంశాలు: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం దేశ భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు […]
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8,931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం, భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. Read Also: MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ […]
IPL Sponsorship Revenue: Indian Premier League (ఐపీఎల్) మరోసారి తన వాణిజ్య శక్తిని నిరూపించింది. ఐపీఎల్ జట్ల స్పాన్సర్షిప్ ఆదాయం రూ.1,000 కోట్ల మైలురాయిని దాటినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇది లీగ్ ప్రజాదరణ ఎంతగానో పెరిగిందని, అలాగే కార్పొరేట్ కంపెనీలు క్రికెట్ను శక్తివంతమైన మార్కెటింగ్ వేదికగా భావిస్తున్నాయని స్పష్టంగా తెలియజేస్తోంది. డబ్ల్యూపీపీ మీడియా రూపొందించిన 2025 ‘స్పోర్టింగ్ నేషన్’ నివేదిక ప్రకారం, ఈ భారీ వృద్ధి ఫ్రాంచైజీలకు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని అందిస్తోంది. టిక్కెట్ […]
Hormuz Amid Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్ జలసంధిపై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ఇరాన్ భారీ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18 కోట్లకు పైగా) చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రపంచ చమురు […]
Social Boycott: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో సామాజిక బహిష్కరణ అంశం కలకలం రేపింది. ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు , ప్రజలు కలసి తీర్మానం చేశారు. భూ వివాదం నేపథ్యంలో కుటుంబానికి సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామస్థులు తీర్మానం చేయడమే కాకుండా, కొండములగాం గ్రామంలో ఎలాంటి పనులకు పిలవకూడదు, ఎటువంటి శుభకార్యక్రమాలకు పిలవవద్దని దండోరా వేయించారు. సదరు కుటుంబం భూమి రికార్డ్ రెవెన్యూలో తారుమారు చేయటం, ఎన్నిసార్లు గ్రామ […]
Petrol Price Hike: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.. ఇక, పాకిస్థాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారాయి. ఇటీవల లీటరుకు రూ.55 పెంపుతో పెట్రోల్ ధర రూ.321 దాటగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచింది. ఇంతకు ముందు లీటరుకు సుమారు […]
MS Dhoni IPL Retirement: ఐపీఎల్ 2026 సీజన్కు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్పై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడయంలో నిర్వహించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ, ప్రస్తుత సీఎస్కే ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ […]
Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పడింది.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని AIMIM పార్టీ, హుమాయున్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJDUP)తో కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 25న కోల్కతాలో నిర్వహించనున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ పొత్తుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ కూటమి ద్వారా […]