Cuba vs United States: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అంశంపై వెనక్కి తగ్గిన నేపథ్యంలో, ఇప్పుడు ప్రపంచ దృష్టి క్యూబాపై పడుతోంది. ఒకవేళ అమెరికా మళ్లీ క్యూబాపై ఒత్తిడి పెంచితే లేదా సైనిక చర్యల దిశగా అడుగులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ అంతర్జాతీయ వేదికలపై ప్రారంభమైంది. క్యూబా వద్ద ఎంత సైనిక శక్తి ఉంది? అమెరికా వంటి మహా శక్తిని అది ఎదుర్కోగలదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్యూబా సైన్యం […]
MP Mithun Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు.. కానీ, ఆ తర్వాత చట్టంలో లేదని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి.. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్ను వాడొద్దు.. దేశాన్ని నిర్మించడానికి డీలిమిటేషన్ ఉపయోగపడాలని హితవు తెలిపారు.. Read Also: Vidadala Rajini: మహిళా బిల్లుకు వైసీపీ […]
Vidadala Rajini: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత విడదల రజని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు మూడు వంతుల రిజర్వేషన్లు కల్పించాలనే కల నెరవేరబోతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తే అది దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా నిలుస్తుందని అన్నారు. ఎన్టీవీతో మాట్లాడిన విడదల రజని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ స్వరూపమే మారిపోతుందని అభిప్రాయపడ్డారు. మహిళా […]
MK Stalin on Delimitation Bill: చెన్నైలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన పునర్విభజన బిల్లు తమిళనాడు రాజకీయ ఉనికిని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇచ్చే హామీలను నమ్మలేమని స్టాలిన్ స్పష్టం చేశారు. నోటి మాటలతో హామీలు ఇవ్వడం కాకుండా, చట్టసభల్లో రాష్ట్రాలకు రక్షణ […]
Story Board: దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు 816కి చేరనున్నాయి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అనే ప్రశ్న కీలకంగా మారింది. 2014లో ఉమ్మడిగా ఉన్న ఏపీ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ సందర్భంగా రెండు […]
High Protein Wheat Flour Roti: ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాలని చూస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, జిమ్కి వెళ్లేవారు, కండరాలు పెంచుకోవాలనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే, మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్లు చాలా ఖరీదైనవిగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే సులభంగా లభించే గోధుమ పిండిని అధిక ప్రోటీన్ పిండిగా మార్చుకోవచ్చు. ఇందుకు కేవలం […]
Summer Kitchen Tips: వేసవి కాలం మొదలైతే ఇంటి అంతా వేడెక్కిపోతుంది. అయితే ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ వేడి ఉండే ప్రదేశం వంటగదే.. బయట ఎండ వేడి, లోపల గ్యాస్ స్టవ్ వేడి కలిసి కిచెన్ను తందూర్లా మార్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంట చేయడం మహిళలకు చాలా కష్టంగా మారుతుంది. చెమటలు పట్టడం, అలసట రావడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. దీంతో, మహిళలు వంట గది అంటేనే భయపడాల్సిన పరిస్థితి.. చాలా ఇళ్లలో వంటగదిలో […]
Book Cover Trick: సీబీఎస్ఈ సిలబస్ చదివే విద్యార్థులకు పరీక్షలు ముగిసి.. తర్వాత అకాడమిక్ ఇయర్ సిలబస్ కూడా స్టార్ట్ అయ్యింది.. మరోవైపు స్టేట్ సిలబస్ చదివే విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయి.. ఏప్రిల్ నెల సగం గడిచిపోయింది.. పిల్లలు కొత్త తరగతులకు అలవాటు పడిపోయారు. కానీ, చాలా మంది తల్లిదండ్రులకు మాత్రం ఇంకా ఒక చిన్న పని మిగిలే ఉంటుంది. అదే పిల్లల కొత్త నోట్బుక్లు, పుస్తకాలకు అట్టలు వేయడం. ఈ పని చిన్నదే అయినా, సమయం […]
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి త్వరిగతిన పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 3 స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైబడి విద్యార్థులున్న పాఠశాలలు […]
Anakapalli Earthquake: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.. రాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అనకాపల్లి పట్టణం పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు సమాచారం. ఇళ్లలోని కొన్ని సామాగ్రి స్వల్పంగా కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. కొంతమంది నిద్రలో ఉండగానే మంచాలు, ఫర్నిచర్ స్వల్పంగా కంపించినట్లు తెలిపారు. […]