Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సర్కార్ సీరియస్.. కీలక ఆదేశాలు
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీరియస్ అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ అధికారులతో సమావేశానికి సిద్ధం అయ్యారు హోమంత్రి మహమూద్ అలీ.. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు హోం మంత్రి.. ఈ సమావేశంలో బోయిగూడ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంపై విశ్లేషించనున్నారు అధికారులు.. ఇక, హైదరాబాద్లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై కూడా రివ్యూ చేయనున్నారు.. మరోవైపు.. తరుచూ గోదాంలపై దాడులు చేయాలని అగ్నిమాపక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి మహమూద్ అలీ..
Read Also: Vizag Steel Plant: లోక్సభలో ఉక్కుశాఖ మంత్రి కీలక ప్రకటన
Also Read
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
కాగా, బోయిగూడలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.. ఈ సమయంలో గోదాంలో ఉన్న 12 మందిలో ఒకరు తప్పించుకోగా.. 11 మంది బీహార్ కార్మికులు సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి.. వారి బంధువుల సహాయంతో గుర్తించారు వైద్యులు.. మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈరోజు 6 మృతదేహాలు, రేపు మరో 5 మృతదేహాల తరలించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఆరు గంటలకు బెంగళూరుకు ఆరు మృతదేహాలను తరలించనుండగా.. ఈరోజు వెళ్లిన మృతదేహాలు బెంగళూరులో భద్రపరుస్తారు.. ఇక, రేపు 5 మృతదేహాలను తరలించనున్నారు.. మొత్తం 11 మృతదేహాలను రేపు స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక, అగ్నిప్రమాదం జరిగిన స్క్రాప్ గోదాం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు అధికారులు.. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా ప్రమాదకరంగా మారింది రేకుల షెడ్డు.. దీంతో షెడ్డు కూల్చివేసేందుకు చర్యలు చేపట్టారు.. ఆరు జేసీబీలతో గోదాంను కూల్చివేయనున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్.. ఇతర పార్టీ నేతలు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. ప్రధాని మోడీ రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి విదితమే.
తాజావార్తలు
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!