KCR: బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.. అందులో మొత్తం 12 మంది ఉండగా.. ఓ యువకుడు మాత్రం.. మంటలు చెలరేగిన తర్వాత.. గోడ దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.. కానీ, మరో 11 మంది సజీవదహనం అయ్యారు.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కాలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.. ఇక, ఘటనా స్థలాన్ని సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు.
Read Also: ED Raids: టార్గెట్ మహా సర్కార్..? ఈడీ రైడ్స్ కలకలం..
Also Read
- OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ... బీఆర్ఎస్ భారీ స్కెచ్?
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్.. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు తెలంగాణ సీఎం.. మృతుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. ఇక, ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరోవైపు ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం సోమేష్ కుమార్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.. చనిపోయిన వాళ్లంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లు.. వారి వారి ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?