Vizag Steel Plant: లోక్సభలో ఉక్కుశాఖ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపై ఎంపీలతో సంతకాలు చేయించి.. దానిని ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వాలని నిర్ణయించింది.. మరోవైపు.. ఇవాళ లోక్సభలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఉక్కశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్..
Read Also: Ukraine Russia War: రష్యాలో దారుణ పరిస్థితులు.. షుగర్ కోసం స్ట్రీట్ ఫైట్స్..
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పదని క్లారిటీ ఇచ్చారు ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వానిది సముచిత నిర్ణయమన్న ఆయన.. స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం.. వారికి నష్టపరిహారం సహా అన్ని సౌకర్యాలు కల్పించామని.. విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్విస్ట్మెంట్ సరైన నిర్ణయంగా పేర్కొన్నారు.. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కంపెనీలు ప్రగతి సాధించాయని 2019-20 ఆర్థిక సర్వే వెల్లడించిందని లోక్సభలో తెలిపిన ఆయన.. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత ఆయా కంపెనీలు ఆర్ధికంగా బలోపేతం అయినట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రామచంద్ర ప్రసాద్ సింగ్.. “క్యాప్టివ్ మైన్స్” లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో లాభాలు ఆర్జించిందన్న ఆయన.. ఉత్పాదకత తగ్గిపోయింది, కెపాసిటి యుటిలైజేషన్ తగ్గిపోయింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ వల్ల అప్పులు పెరిగిపోయాయి.. 7 వేల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయని.. అందుకే, పెట్టబడుల ఉపసంహరణ తప్పదని స్పష్టం చేశారు.. దీని వల్ల ప్లాంట్ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!