కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది. గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు. […]
కాదేదీ క్రైమ్కు అనర్హం.. అనేలా ఉంది పరిస్థితి. ఊరు లేదు.. పేరు లేదు.. ఇంకా చెప్పాలంటే అసలు దేశమే లేదు. కానీ అలాంటి దేశంలో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఒకడు దుకాణం తెరిచాడు. తన వలలో పడ్డ వారి దగ్గర అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆ నోటా ఈ నోటా పోలీసులకు విషయం తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సొంతంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు […]
Jagdeep Dhankhar : ధన్ ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే చర్చ బాగా జరుగుతోంది. ఇదే సమయంలో బీహార్ ఎన్నికలు, విపక్ష కూటమిని బలహీనం చేసే చర్యలకు ఈ పరిణామం నాంది పలుకుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ లో ఏం జరుగుతుందో చూడాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నా.. ఉపరాష్ట్రపతి పదవికి జగ్ దీప్ ధన్ […]
Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది. […]
HYDRA :నగరంలోని నాలాలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లడం సాధారణమైంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్కు వరదనీరు చేరే నాలా పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది. ఎన్నిసార్లు శుభ్రం చేసినా, టన్నుల కొద్దీ చెత్త తిరిగి బయటపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక బృందాలు ఈ నాలాలను శుభ్రం చేయడంలో బిజీగా ఉన్నాయి. టోలీచౌక్ సమీపంలోని హకీంపేట ప్రాంతంలో రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది బుల్కాపూర్ నాలాను శుభ్రం చేశారు. […]
Sapta Sindhu 2025 : హైదరాబాద్లో AE ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సప్తసింధు-2025 – ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు” (Inter College Temple Model Making Competition) ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. బుధవారం టీ-హబ్లో జరిగిన ఈ పోటీలు విద్యార్థులు రూపొందించిన ఆలయ నమూనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పద్మశ్రీ బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ, “భారతీయ దేవాలయాల సృజనాత్మకత, శిల్ప సంపద ప్రపంచాన్ని […]
Telangana Secretariat : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. భారీ వర్షాలకు తడిసి పెచ్చులు ఊడిపడటంతో సచివాలయ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల నుంచి సచివాలయానికి మరమ్మతులు (రిపేర్లు) చేస్తున్నప్పటికీ, ఈ ఘటన చోటుచేసుకోవడం పనుల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. Illegal immigrants: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. భారత్పై హక్కుల సంస్థ ఆరోపణలు.. […]
CM Revanth Reddy : తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చని, దీనిపై సోనియాగాంధీ తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం తన జీవితంలో ఒక గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తున్నానని అన్నారు. “సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిది. అది నోబెల్, ఆస్కార్ అవార్డు […]
హైడ్రా – జీహెచ్ ఎంసీ పరస్పర సహకారంతో పని చేస్తే వర్షాకాలం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడగలమని హైడ్రా – జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , కర్ణన్ అభిప్రాయ పడ్డారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కారంలో ఇబ్బందులపై ఇరువురు కమిషనర్లు గురువారం జీహెచ్ ఎంసీ కార్యాలయంలో చర్చించారు. ఇరు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. […]
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్లో చేయూత పెన్షన్ల పంపిణీపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్, డైరెక్టర్ గోపి, జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరయ్యారు. పెన్షన్ల పంపిణీలో నూతన టెక్నాలజీని తప్పనిసరిగా […]