Minister Seethakka : మేడారం మహాజాతర కోసం అటవీ మార్గాల్లో కొత్త రహదారులు
- భక్తుల రాకపోకలకు కొత్త రహదారులు
- అటవీ మార్గాల్లో బీటీ రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు
- రూ.16.5 కోట్లతో కొండాయి వంతెన పూర్తి
- సంప్రదాయాలకు భంగం లేకుండా ఆధునీకరణ పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రహదారులు నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. వచ్చే జనవరిలో జరగబోయే మహా జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగవంతంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు.
రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీతో పాటు మేడారం సర్కిల్ పోలీస్ అధికారులతో కలిసి కొత్త మార్గాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు అటవీ మార్గాల్లో కొత్త రహదారులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా భక్తులు సులభంగా మేడారం ఆలయానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
కొండపర్తి–గోనెపల్లి–ముత్తాపురం మీదుగా పడికాపురం వరకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, కాల్వపల్లి నుంచి కన్నేపల్లి వరకు, కాల్వపల్లి నుంచి ఊరటం వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఊరటం మార్గంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఛత్తీస్గడ్, ఖమ్మం వైపుల నుంచి వచ్చే భక్తులకు చిన్నబోయినపల్లి మీదుగా ఊరటం దాకా కొత్త మార్గం అందుబాటులోకి రానుంది.
మహాజాతరలోపు రూ.16.5 కోట్లతో కొండాయి వాగుపై వంతెనను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి ఇప్పటికే మంజూరు చేశారని తెలిపారు. జాతర సమయంలో అటవీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, డివైడర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
సమ్మక్క–సారలమ్మ కీర్తి మరింత ఇనుమడించేలా జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ పూజారుల ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలకు భంగం కలగకుండా పనులు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. గతంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించగా, వాటిని అడ్డుకున్నానని, ఆదివాసీ సంప్రదాయాల రక్షణ తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. భక్తులు దుష్ప్రచారాలను నమ్మవద్దని, సమ్మక్క–సారలమ్మ కీర్తిని మరింత పెంచేలా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!