Minister Seethakka : మేడారం మహాజాతర కోసం అటవీ మార్గాల్లో కొత్త రహదారులు
- భక్తుల రాకపోకలకు కొత్త రహదారులు
- అటవీ మార్గాల్లో బీటీ రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు
- రూ.16.5 కోట్లతో కొండాయి వంతెన పూర్తి
- సంప్రదాయాలకు భంగం లేకుండా ఆధునీకరణ పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రహదారులు నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. వచ్చే జనవరిలో జరగబోయే మహా జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగవంతంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు.
రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీతో పాటు మేడారం సర్కిల్ పోలీస్ అధికారులతో కలిసి కొత్త మార్గాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు అటవీ మార్గాల్లో కొత్త రహదారులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా భక్తులు సులభంగా మేడారం ఆలయానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
కొండపర్తి–గోనెపల్లి–ముత్తాపురం మీదుగా పడికాపురం వరకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, కాల్వపల్లి నుంచి కన్నేపల్లి వరకు, కాల్వపల్లి నుంచి ఊరటం వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఊరటం మార్గంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఛత్తీస్గడ్, ఖమ్మం వైపుల నుంచి వచ్చే భక్తులకు చిన్నబోయినపల్లి మీదుగా ఊరటం దాకా కొత్త మార్గం అందుబాటులోకి రానుంది.
మహాజాతరలోపు రూ.16.5 కోట్లతో కొండాయి వాగుపై వంతెనను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి ఇప్పటికే మంజూరు చేశారని తెలిపారు. జాతర సమయంలో అటవీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, డివైడర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
సమ్మక్క–సారలమ్మ కీర్తి మరింత ఇనుమడించేలా జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ పూజారుల ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలకు భంగం కలగకుండా పనులు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. గతంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించగా, వాటిని అడ్డుకున్నానని, ఆదివాసీ సంప్రదాయాల రక్షణ తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. భక్తులు దుష్ప్రచారాలను నమ్మవద్దని, సమ్మక్క–సారలమ్మ కీర్తిని మరింత పెంచేలా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!