ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్రావు లు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే ఈ భేటీలో తెలంగాన నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ […]
ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మండలి సమావేశాలు ప్రారంభంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండలి ముందుకు 3 రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భావించామన్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే పెట్టారని అన్నారు. మిగితా రాష్ట్రాలు బీహెచ్ఈఎల్, బీడీఎల్ వంటి సెక్టార్లను […]
మామూలుగా అఘోరా అంటేనే ఆశ్చర్యం, ఒక్కింత భయం కలగడం సహజం. దానికి కారణం అఘోరాల విధివిధానాలే. అఘోరాల్లో కొందరు నగ్నంగా, చిన్న గుడ్డకట్టుకొని కనిపించడమే కాకుండా వారి రూపం కూడా భయాందోళనకు గురి చేస్తుంటుంది. అంతేకాకుండా ఈ అఘోరాలు కాలిన బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవడం, మానవ మృతదేహాలను తినడం లాంటి విపరీత చర్యలు చూసి ఒక్కింత భయం కలుగుతుంది. అయితే తాజాగా ఓ అఘోరా తన శిష్యురాలిగా ఉన్న అఘోరీని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడుకు […]
కరోనా పేరు చెప్పగానే యావత్తు ప్రపంచం ఉలిక్కిపడుతోంది. కరోనా మహమ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు.. కరోనా ధాటికి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 2020 సంవత్సరాన్ని కరోనా కాలంగా గుర్తుండిపోయే విధంగా చేసింది. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్, థార్డ్ వేవ్ అంటూ దశల వారీగా తన ప్రతాపాన్ని చూపుడుతోంది. ఎన్నో దేశాలు కరోనా వైరస్పై పరీక్షలు చేసిన టీకాలను కొనుగొన్నారు. ఆయా […]
ఏపీలో సంచలన సృష్టించిన 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా త్వరలోనే కొన్ని మార్పులతో మరోసారి బిల్లును తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా 3 రాజధానుల సినిమా అయిపోలేదు అన్నారు. అయితే తాజాగా తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా 3 రాజధానుల అంశంపై స్పందించారు. సీఎం జగన్ తగ్గేదేలేదని.. […]
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. గతంలో సంవత్సరం జనవరిలో శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హజరుకాకపోవడంతో ఈ తీర్మానంపై వ్యతిరేకంగా ఓట్లు రాలేదు. దీంతో ఆ రోజు […]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు జరుగనుంది. అయితే నేడు 23వ రోజు నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు అమరావతి రైతుల జేఏసీ నాయకులు తెలిపారు. కొండబిట్రగుంట నుంచి ప్రారంభమయ్యే సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు సాగనుంది. అయితే నవంబర్ 1న ప్రారంభమైన ఈ పాదయాత్ర డిసెంబర్ 15వ తిరుమలకు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. […]
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రాజ్యసభ ఆ స్థానంలో రాజ్యసభకు కవితను వెళ్లబోతుందంటూ ప్రచారం […]
ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రకారం నేటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికీ టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా వారివారి నామినేషన్లను సమర్పించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో […]
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన […]