CM Revanth Reddy :ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు చర్చలపై కీలక మలుపు
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ కీలక చర్చలు
- బీఆర్ఎస్ కాలంలో సిద్ధమైన విజిలెన్స్ రిపోర్ట్ వెలికితీత
- ప్రైవేట్ కాలేజీల అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన
- నకిలీ సిబ్బంది, సౌకర్యాల లోపంపై ప్రభుత్వ ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్టాపిక్గా మారింది. ఈ విషయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి కీలకంగా చర్చించారు. ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో సిద్ధమైన విజిలెన్స్ రిపోర్ట్ను తిరిగి పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రిపోర్ట్లో అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని లాభాల కోసం వినియోగించుకున్నట్లు స్పష్టంగా తేలినట్టు తెలుస్తోంది.
Donald Trump: ఇజ్రాయెల్పై ట్రంప్ ఫైర్.. ఖతార్తో జాగ్రత్త అంటూ హెచ్చరిక
Also Read
- Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
- CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
విద్యార్థి సంఘాలు కూడా ఈ రిపోర్ట్ను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీలు విద్యా ప్రమాణాలను విస్మరించి బకాయిల చెల్లింపుల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నకిలీ సిబ్బందిని చూపించి అనుమతులు పొందడం, సౌకర్యాలు కల్పించకుండా కోట్లు దాచుకోవడం, తనిఖీలు తూతూమంత్రంగానే జరగడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా, కోట్ల రూపాయల నిధులు కాలేజీ యాజమాన్యాల మధ్య చేతులు మారుతున్నాయంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ను సమగ్రంగా పరిశీలించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవచ్చని సంకేతాలు ఇస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల చర్చలు ఈసారి ఎటువంటి నిర్ణయానికి దారితీస్తాయో విద్యార్థులు, కాలేజీలు, తల్లిదండ్రులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు
తాజావార్తలు
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!