Telangana : మీ వాహనానికి కొత్త నంబర్ ప్లేట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా.?
- పాత వాహనాలకు తప్పనిసరి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
- సెప్టెంబర్ 30లోపు మార్చుకోకపోతే కఠిన చర్యలు
- వాహన రకాన్నిబట్టి HSRP ధరలు ఎంత?
- నకిలీ ప్లేట్లను అరికట్టే నూతన నిబంధన
Telangana : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. గడువు లోపు నంబర్ ప్లేట్లు మార్చుకోకపోతే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి సేవలు కూడా నిలిపివేయబడతాయని రవాణాశాఖ హెచ్చరించింది.
కొత్త నంబర్ ప్లేట్ అమర్చే బాధ్యత పూర్తిగా వాహన యజమానిదేనని నిబంధనలో పేర్కొన్నారు. ఇకపై HSRP లేని వాహనాలను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా అనుమతించబడదు. ప్లేట్ల ధర వాహనం రకాన్నిబట్టి మారుతుంది. ఉదాహరణకు, టూ వీలర్లకు సుమారు రూ.320 నుంచి రూ.380 వరకు, ఫోర్ వీలర్లకు రూ.590 నుంచి రూ.700 వరకు ఖర్చవుతుంది. ఆటో రిక్షాలకు రూ.450 నుంచి రూ.550, కమర్షియల్ వాహనాలకు రూ.1,100 నుంచి రూ.1,500 వరకు చార్జీలు ఉంటాయి. అదనంగా హోమ్ ఇన్స్టలేషన్ లేదా డోర్ స్టెప్ సర్వీస్ కోరుకుంటే వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కలర్ స్టిక్కర్ రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది.
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల అమలుకు ముఖ్య కారణాలు నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహన దొంగతనాలను అరికట్టడం, రోడ్డు భద్రతను పెంపొందించడం. ఈ ప్లేట్లలో ప్రత్యేకమైన హోలోగ్రామ్, IND మార్కింగ్ ఉండటంతో వాటిని కాపీ చేయడం అసాధ్యం. అంతేకాకుండా ఇవి కేంద్ర డేటాబేస్కు అనుసంధానమై ఉండటంతో వాహనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. దీని వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ల్లో సమస్యలు రాకుండా ఉంటాయి.
HSRP ప్లేట్ల కోసం వాహన యజమానులు డీలర్షిప్లు లేదా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30 గడువు లోపు తప్పనిసరిగా కొత్త నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని రవాణాశాఖ స్పష్టంచేసింది.
CM Chandrababu: టీటీడీ భక్తులకు గుడ్స్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. 13 ఎకరాల విస్తీర్ణంలో…
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!