CM Revanth Reddy: తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం..
- ఒక్కో అడుగు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూన్నాళ్ళ ముచ్చటే అన్నారు.. మూడు నెలల తర్వాత.. కలిసి పని చేయలేరు అన్నారు.. ఆ తర్వాత పథకాలు అమలు ఎక్కడ చేస్తారని విమర్శలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… తెలంగాణ రోల్ మోడల్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం.. రైతాంగానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మనది.. గోతి కాడ నక్కలా చూశారు కొందరు.. రైతు భరోసా వేయరు అనుకున్నారు.. కానీ, 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.. రైతు రాజ్యం ఎవరు తెచ్చారని చర్చ పెడదాం.. ఢిల్లీలో మోడీ వస్తాడా.. గల్లీలో కేడీ వస్తాడా చూద్దాం.. నేను మా కార్యకర్తలతో వస్తాను అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
Also Read
- GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
- Telangana : దోశ.. పూరి.. మిల్లెట్ ఇడ్లీ.. బోండా.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 12 నుంచి..
- Telangana Congress: గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
- Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
అయితే, పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బట్టలూడదీసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లకు ఇచ్చే సరుకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు.. కానీ, మనం అధికారంలోకి వచ్చాకా మహిళా సంఘాలకు సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ఇచ్చామని తెలిపారు. ఒక్కో అడుడు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.
తాజావార్తలు
-
US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
-
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
-
SRH Vs RR: టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
-
Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
-
Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!