కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది.
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ…
Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్లో అసంతృప్తిని పెంచుతోంది.
MLA Anirudh Reddy : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు…
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60…
ఫ్యూఛర్ సిటీ... దేశంలోని నగరాలతోకాదు.. ప్రపంచ నగరాలతో పోటీ పడేవిధంగా తీర్చిదిద్దేలనే లక్ష్యంతో దార్శనిక ప్రణాళిక రెడీ అయింది. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు, సాంకేతిక, అంతరిక్ష, వైమానిక, రక్షణ, పర్యాటక, సెమీకండక్లర్ల పరిశ్రమలను స్థాపించ బోతున్నారు. ఇందుకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రోత్సాహాలను అందించి.. పెట్టుబడులు సాధించారు.
ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ముగ్గురు మంత్రులు, అదీ…. ముఖ్యమైన పోర్ట్ఫోలియోల్లో ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉంటే… అక్కడ లోకల్గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే…మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానివే. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే, అటు భద్రాచలంలో బీఆర్ఎస్…