రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. నంది నగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నంది నగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటి సారి గవర్నర్ ప్రసంగానికి , రెండవ సారి బడ్జెట్ ప్రసంగం…
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు…
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించారు.
స్టీలు ప్లాంటు మీద ప్రధాని మోడీ కన్ను పడిందని మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్టీలు ప్లాంటును ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఏపీ కాంగ్రెస్ లో రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో పదవుల పంపకాలు గొడవలకు దారితీస్తున్నాయా? జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు ఎందుకంత గిరాకీ ఏర్పడింది?పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ఉన్నట్టుండి ప్రాధాన్యత పెరుగుతోందా?పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెడుతున్నదెవరు?ఇంతకీ…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?పదవుల కోసం పోటీ పడుతున్న నేతలెవరు?అసలు…గొడవలకు కారణం అవుతున్న ఆ పదవులేంటీ? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో పదవులు ఆశించే నాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. మరీ…
మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద…
ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ వేధించే సమస్య విద్యత్ అంతరాయం. కరెంట్ కోతలతో దేశంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పలు ప్రాంతాలు విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో విసుగు చెంది ప్రజలు రోడ్లపైకెక్కి నిరసనలకు దిగడం చూసే ఉంటారు. అయితే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తరచుగా విద్యుత్ కోతలతో విసుగు చెంది అధికారులకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం…