TPCC Mahesh Goud : ప్రజాపాలన రెండేళ్ల వేడుకలను దారి మళ్లించే ప్రయత్నంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆయన, అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో రాకుండా ఉండేందుకు హీల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రభుత్వం…
రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది.
ఇక మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్.. తేడా జరిగితే అంతే సంగతులు. పదవి ఉంది కదా.. పార్టీ పవర్లో ఉంది కదా.. ఎంజాయ్ చేసేద్దాం.. అనుభవించు రాజా అంటూ ఆడుతూ పాడుతూ గడిపేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు చెప్పేసిందట అధినాయకత్వం.
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాలివాటంలో గెలిచిన ఎమ్మెల్యే తీరు ఇలా కాకుంటే ఇంకెలా ఉంటుందిలే అంటూ... పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట. వయసులో పెద్దవాడని, గతంలో ఆయనకు ఉన్న ట్రాక్
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే ప్రారంభమైందన్నారు. అలాగే, యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతా చారి బలిదానం చేశాడు అన్నారు.
Rajnath Singh: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘‘బాబ్రీ మసీదు’’ను తిరిగి నిర్మించేందుకు ప్రజా ధనాన్ని ఉపయోగించాలని అనుకున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కర్ణాటకలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ట్విస్టులు.. మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రేక్ఫాస్ట్’ పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే ఈ అల్పాహారం రాజకీయాల వెనుక చాలా కథనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్…
సంచార్ సాథీ యాప్పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. సంచార్ సాథీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా…