తెలంగాణలో పొత్తులకు సంబంధించి బీజేపీ హై కమాండ్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. మనం సోలో.... సింహం సింగిల్గానే వస్తుందంటూ పదే పదే చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు. ఎన్నిక ఏదైనాసరే... మనది ఒంటరి పోరేనని సూటిగా సుత్తిలేకుండానే పార్టీ మీటింగ్స్లో చెప్పేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు అక్కడ మిత్రుల మధ్య కొత్త పంచాయితీ పెట్టాయా? ఎక్కడైనా బావేగానీ వంగతోట కాడ కాదన్నట్టుగా ఎవరికి పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారా? స్టేట్ పాలిటిక్స్ వేరు, లోకల్ లెక్కలు వేరన్నట్టుగా… ఎక్కడి రాజకీయం నడుస్తోంది? ఏయే పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది? Also Read:Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్లో టెన్షన్ టెన్షన్.. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ ఊపందుకుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్నది. అయితే పలు గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామం అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? జూబ్లీహిల్స్ అనుభవం ఆ పార్టీకి సరికొత్త పాఠం నేర్పిందా? అందుకే స్టేషన్ ఘన్పూర్లో గేమ్ మారిపోయి ప్లాన్ ఎ, ప్లాన్ బీ కూడా తెర మీదికి వచ్చాయా? బలమైన ఇద్దరు నేతల్ని చేర్చుకుని కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనుకుంటోందా? ఎవరా ఇద్దరు? ఘన్పూర్ గేమ్ ప్లాన్ ఏంటి? జూబ్లీహిల్స్ ఓటమితో దిమ్మతిరిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక అలర్ట్ అయిపోయిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు…
తెలంగాణ సర్కార్లో బ్లాక్షీప్ ఎవరో తెలిసిందా? కేబినెట్ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్స్టాప్గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్ తెలంగాణ కేబినెట్లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష…
TPCC Mahesh Goud : కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్…
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం…
కలిసికట్టుగా పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో టైంపాస్ చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?. భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు. అదీకూడా… తమ ఫీలింగ్స్ని ఏ మాత్రం దాచుకోకుండా… ఓపెన్ వార్ డిక్లేర్…