తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఓ ముస్లిం వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో విపక్షాలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చాలా దుమారమే చెలరేగింది.
మూడు దశాబ్దాల నాటి కేసు మహారాష్ట్ర మంత్రి మెడకు చుట్టుకుంది. 1995 గృహనిర్మాణ కుంభకోణం కేసులో మంత్రి మాణిక్రావ్ కోకటే, ఆయన సోదరుడు విజయ్ కోకాటేను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు కొందరు డిఫెన్స్లో పడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడుల మాటలు వాళ్ళలో పొలిటికల్ భరోసా కల్పించకపోగా… కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు ఫీలవుతున్నారా? సెల్ఫ్ డిఫెన్స్కు కూడా ఛాయిస్ లేకుండా పోతోందా? ఎవరా ఎమ్మెల్యేలు? వాళ్ళ భయం ఏంటి? పవర్, పొజిషన్తో మైలేజ్ పాలిటిక్స్ చేద్దామనుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్ధితి అడకత్తెరలోపడినట్టే కనిపిస్తోంది. నేలనపోయే కష్టాలన్నీ వాళ్ళ నెత్తినెక్కి తాండవం చేస్తున్నాయా….…
Sanjay Raut: డిసెంబర్ 19న దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దేశంలో ‘‘రాజకీయ భూకంపం’’ వస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూలిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలనే మరోసారి సంజయ్ రౌత్ చెప్పారు.
Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ల ప్రక్షాళన కోసం నిర్వహిస్తున్న ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా, బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ పరిణామం రుచించని విషయంగా ఉంది. ఎస్ఐఆర్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలను బహిర్గతం చేసిందని, రాష్ట్రంలో ఆమె పాలన అంతం కాబోతోందని బీజేపీ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీ అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వేసిన ఓట్ల కారణంగానే అధికారంలో…
పార్లమెంట్లో ఈ-సిగరెట్ వివాదం ఇంకా కొనసాగుతోంది. గత వారం బీజేపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోపల ఈ-సిగరెట్ తాగేందుకు అనుమతి ఉందా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ లేదని చెప్పారు.
ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తే పదవులు రావా? పనీ పాటా లేకుండా… ఏళ్ళ తరబడి జస్ట్ అలా.. అలా… టైంపాస్ చేస్తూ కూర్చుంటే పోస్ట్లు వాటంతట అవే పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోతాయా? కేడర్లో అదే అభిప్రాయం బలపడుతోందా? ఆంధ్రా కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? మారుతున్న ఆలోచనా ధోరణి మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందా? Also Read:Pawan Kalyan: ఒక్కో అభ్యర్థికి ఒక్కో కథ ఉంటుంది.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు…
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగానే కమలనాథులు కసరత్తు ప్రారంభించారు. బీహార్లో ఘన విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న నాయకులు... త్వరలో జరగనున్న ఎన్నికల రాష్ట్రాలపై దృష్టి పెట్టారు.