పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. వారం కిందటే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో వాకా స్టేడియంలో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు, బౌలరర్లు బరిలోకి దిగారు. మూడోరోజు వార్మప్కు సంబంధించి వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.…
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్-గవాస్కర్…
పెర్త్లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు.
Border Gavaskar Trophy: నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కింద ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ పెర్త్ క్రికెట్ స్టేడియంలో, రెండో మ్యాచ్ అడిలైడ్లో, మూడో టెస్టు బ్రిస్బేన్లో, నాలుగో టెస్టు మెల్బోర్న్లో, చివరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర నిజానికి చాలా పాతది. 1947 నుండి 1992 వరకు…
‘పరుగుల రారాజు’ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్వన్ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్-20 నుంచి కూడా ఔట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ…
టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్లు కింగ్ కోహ్లీకి తమ విషెస్ను తెలిపారు. చిన్నప్పటి కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజంగా మారడంపై మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. తండ్రి మరణించినా స్వదేశంలో జరిగిన ఓ మ్యాచ్లో కోహ్లీ ఆడిన క్షణాన్ని గుర్తు చేశాడు. ‘ఆ…
టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్తో తేలిపోనుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. ఈ ఇద్దరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే మరికొంతకాలం ఆడే అవకాశం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ను గెలవడంపైనే దృష్టి సారించాలని, ఆ తర్వాతే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గురించి ఆలోచించాలని సన్నీ సూచించారు. మొన్నటివరకు అత్యంత బలంగా ఉందనిపించిన భారత జట్టుకు ఇప్పుడు కఠిన సవాల్ ఎదురుకానుందని గవాస్కర్…
అండర్ -19 ప్రపంచ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా, సమర్ధుడైన నాయకుడిగా భారత జట్టుపై తన ముద్ర వేశాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్లో రన్ మెషీన్గా.. రికార్డులు బద్ధలు కొట్టే రారాజుగా.. క్రికెట్ ఛేజ్ మాస్టర్గా గుర్తింపు పొందాడు. తన క్లాస్ ఇన్నింగ్స్లతో అభిమానుల గుండెల్లో చెలరేగని స్థానం సంపాధించిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. నేటితో కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోహ్లీ పుట్టినరోజు…
నేడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో కింగ్ కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విరాట్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కోహ్లీపై అభిమానంతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఆర్ట్ను రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్లో 5 అడుగుల సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేసినట్లు సుదర్శన్ తెలిపారు. Also Read:…
స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్వాష్ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్ పిచ్లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ స్పందించాడు.…