Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
- బాక్సింగ్ డే టెస్టులో
- ఆస్ట్రేలియా అభిమానులపై
- గుస్సాయించిన విరాట్ కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్సైడ్ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి బలయ్యాడు. బోలాండ్ వేసిన ఆఫ్సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కిన కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు.
Also Read: Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
కోహ్లీ, యశస్వి జైస్వాల్ తో కలిసి 3వ వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత జైస్వాల్ రనౌట్ కావడంతో కోహ్లీ సహనం కోల్పోయి మరోసారి ఆఫ్ స్టంప్ బంతిని ఆడి వికెట్ కీపర్కు చిక్కాడు. ఇక కోహ్లీ ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళుతుండగా, కొంతమంది ఆసీస్ అభిమానులు అతన్ని ఎగతాళి చేశారు. వారు మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలు, ఆసీస్ అభిమానుల ప్రవర్తనతో కోహ్లీకి తీవ్రంగా కోపాన్ని తెప్పించాయి.
The booing Aussie fans should thank god that this Virat Kohli is in his bhajan-kirtan phase.
pic.twitter.com/5mrTQW39Bj— Johns (@JohnyBravo183) December 27, 2024
ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన కోహ్లీ మళ్లీ వెనక్కి తిరిగి వారిపై సీరియస్గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా అభిమానుల ప్రవర్తనను ఖండించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 164/5 స్కోరు చేయగా.. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా ఫాలో ఆన్ను తప్పించుకోవాలంటే భారత్కు ఇంకా 111 పరుగులు అవసరం.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..