Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
- బాక్సింగ్ డే టెస్టులో
- ఆస్ట్రేలియా అభిమానులపై
- గుస్సాయించిన విరాట్ కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్సైడ్ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి బలయ్యాడు. బోలాండ్ వేసిన ఆఫ్సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కిన కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు.
Also Read: Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కోహ్లీ, యశస్వి జైస్వాల్ తో కలిసి 3వ వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత జైస్వాల్ రనౌట్ కావడంతో కోహ్లీ సహనం కోల్పోయి మరోసారి ఆఫ్ స్టంప్ బంతిని ఆడి వికెట్ కీపర్కు చిక్కాడు. ఇక కోహ్లీ ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళుతుండగా, కొంతమంది ఆసీస్ అభిమానులు అతన్ని ఎగతాళి చేశారు. వారు మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలు, ఆసీస్ అభిమానుల ప్రవర్తనతో కోహ్లీకి తీవ్రంగా కోపాన్ని తెప్పించాయి.
The booing Aussie fans should thank god that this Virat Kohli is in his bhajan-kirtan phase.
pic.twitter.com/5mrTQW39Bj— Johns (@JohnyBravo183) December 27, 2024
ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన కోహ్లీ మళ్లీ వెనక్కి తిరిగి వారిపై సీరియస్గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా అభిమానుల ప్రవర్తనను ఖండించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 164/5 స్కోరు చేయగా.. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా ఫాలో ఆన్ను తప్పించుకోవాలంటే భారత్కు ఇంకా 111 పరుగులు అవసరం.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!