Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ అశుతోష్ పాండేకు ఫేస్బుక్లో పాకిస్థాన్ నుంచి బెదిరింపు వచ్చింది. దీనిపై పాండే పోలీసులకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
Man plugs kettle in train: కదులుతున్న ట్రైన్లో ప్రయాణికుడు తెలియక చేసిన తప్పిదం అతను అరెస్ట్ అయ్యేందుకు కారణమైంది. రైలులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే సాకెట్ని నీటిని వేడిచేసుకునేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ కోసం వాడాడు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్వాల్ అనే వృద్ధుడు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు.
Indigo Ayodhya Flight: ఇండిగో ఎయిర్లైన్ అయోధ్య నుండి అహ్మదాబాద్కు వాణిజ్య విమాన సర్వీసును ప్రారంభించింది. విమానయాన సంస్థ ఈ కొత్త మార్గాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్పత్లో చోటు చేసుకుంది.
Ram Mandir: అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువరు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలు అందించింది. అయితే ఉత్తర్ప్రదేశ్ మీర్జాపూర్లో సాధారణ జీవితం గుడుపుతున్న మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి రామాలయ ఆహ్వానం అందడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హబీబ్కి రాముడి అక్షింతలు, లేఖ అందాయి. దీంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు.
Ram Temple Inauguration: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు, భక్తులు ఈ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలువురు కీలక వ్యక్తులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు. సాధువులతో పాటు ఫిలిం స్టార్స్, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు దీనికి హాజరవబోతున్నారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలను చేసింది.
Ram Temple: దేశవ్యాప్తంగా అంతా రామమందిర ప్రారంభోత్సవంపైనే చర్చ నడుస్తోంది. హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్య రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగబోతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి.