Ayodhya Ram Mandir : రాముడు వచ్చే వేళా విశేషం.. ఉత్తర ప్రదేశ్కు కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సోమవారం దివ్య ముహూర్తంలో జరగనుంది. అయోధ్యలో దేవుడు ఆశీసుడైన వెంటనే యూపీలో కాసుల వర్షం కురవనుంది. దీంతో ఆ రాష్ట్రంలో కుబేరులు తయారుకానున్నారు. ఎలా అంటూ ఆశ్చర్యపోతున్నారా.. రామాలయం కారణంగా దేశంలో పర్యాటకం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానా డబ్బులతో నిండిపోతుంది. ఈ విషయాలపై SBI ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో రామమందిరం తర్వాత ఆ రాష్ట్ర ఆదాయం ఎంత పెరుగుతుందో లెక్కలు కట్టింది. అలాగే, దేశంలోని పర్యాటక రంగంలో ఎంత వృద్ధి సాధిస్తుంది… దీని వల్ల యూపీ, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వరకు లాభపడుతుందో ఆ నివేదికలో పేర్కొంది.
అయోధ్యలో రామ మందిరం కారణంగా పర్యాటక రంగం ఊపంందుకుని 2025 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీకు ఏటా రూ.20 నుంచి 25 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఎస్బీఐ పరిశోధకుల నివేదికలో పేర్కొన్నారు. యుపి ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. రాష్ట్రంలోని పర్యాటకుల ఖర్చు రెండేళ్ల క్రితంతో పోలిస్తే 2024 నాటికి రెట్టింపు కావచ్చు. 2022లో ఉత్తరప్రదేశ్ను సందర్శించిన దేశీయ పర్యాటకుల ఖర్చు రూ. 2.2 లక్షల కోట్లు. విదేశీ పర్యాటకులు చేసిన ఖర్చు రూ.10 వేల కోట్లు. కాగా, 2024 సంవత్సరం చివరినాటికి అయోధ్య రామాలయం, ప్రభుత్వ పర్యాటక రంగంపై దృష్టి సారించడం వల్ల పర్యాటకుల ఖర్చు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఎస్బిఐ రీసెర్చ్ అంచనా వేసింది.
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
Read Also:IND vs ENG: మరో 10 వికెట్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్!
మరోవైపు, మనం పర్యాటకుల సంఖ్య గురించి చూస్తే, దాని అన్ని రికార్డులను 2024 సంవత్సరంలో బద్దలు కొట్టవచ్చు. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 32 కోట్లకు పైగా ఉంది. ఇది 2021 సంవత్సరంతో పోల్చుకుంటే 200 శాతం ఎక్కువ. 2022లో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.21 కోట్లు. ఇదో రికార్డు
వచ్చే ఐదేళ్లలో యూపీ ఆర్థిక గణాంకాలపై ఎస్బీఐ నివేదిక భారీ అంచనాలు వేసింది. 2028 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ ఏడాదిలోనే ఉత్తరప్రదేశ్ జీడీపీ 50 బిలియన్ డాలర్లు దాటనుంది. విశేషమేమిటంటే 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ జీడీపీ వాటా రెండోస్థానానికి చేరుకుంటుంది. అలాగే, యుపి జిడిపి పరిమాణం యూరోపియన్ దేశం నార్వే కంటే కూడా పెద్దగా ఉంటుంది. నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యుపి జిడిపి రూ. 24.4 లక్షల కోట్లు అంటే 298 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
Read Also:Pawan Kalyan: క్షేత్రస్థాయి పర్యటనకు పవన్ సిద్ధం.. రోజుకు మూడు సభల్లో పాల్గొననున్న పవన్
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!