Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.
భద్రతా ఉల్లంఘనలపై ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు దాదాపు 12,000 మంది సిబ్బందిని అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది. అయితే నేరస్తుల ఆటకట్టించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని కూడా ఉపయోగిస్తున్నారు.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Also: Khalistan: ప్రభుత్వ పాఠశాల గోడపై “ఖలిస్తానీ” అనుకూల రాతలు.. దర్యాప్తు ప్రారంభం..
ప్రాణప్రతిష్ట వేడుక ముందు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ అయోధ్యకు ఉన్నతస్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని పంపింది. అయోధ్య భద్రతను పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం చేశారు. ఇక్కడ నుంచే వివిధ భద్రతా ఏజెన్సీలు రియల్టైంలో సెక్యూరిటీని పర్యవేక్షిస్తాయి.
ముఖ్యంగా అనుమానిత కార్యకలాపాలను గుర్తించేందుకు, నేరస్తులు, దుర్మార్గులను గుర్తించేందుకు భద్రతా ఏజెన్సీలు తొలిసారిగా AI నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అయోధ్య చుట్టుపక్కల 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా ఎల్లోజోన్ పరిధిలో ఉన్నాయి. ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం AIని ఉపయోగిస్తున్నామని యూపీ పోలీస్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. నేరస్తులను గుర్తించడంలో, సరిపోల్చడంలో సాయం చేయడానికి ఏఐకి ఉత్తర్ ప్రదేశ్ క్రిమినల్ డేటా బేస్ పోర్టల్ని అప్లోడ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన AI- ఆధారిత CCTV నిఘా వ్యవస్థ వ్యక్తులు లేదా ఏదైనా సమూహాలు అసాధారణంగా ప్రవర్తించడాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?