అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు.
UP IAS Transfers: ఉత్తరప్రదేశ్లో బుధవారం భారీ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 13 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. కె విజయేంద్ర పాండియన్ లక్నోకు తిరిగి వచ్చి కాన్పూర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హోటల్ ప్రీత్ ప్యాలెస్లో 28 ఏళ్ల యువతి రక్తంతో తడిసిపోయి కనిపించింది. మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో మహిళ శవమై కనిపించింది.
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.
అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన యూపీలోని హర్దోయ్లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఒక యువకుడు బాలికకు ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడు.
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న కూలీల పికప్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, పలువురు చిన్నారులు సహా 29 మంది గాయపడ్డారు.
తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ... వాళ్లకోసం ఏం చేయాలీ... ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది.