UP Crime: మధురలో దారుణం.. కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
- ఉత్తర్ ప్రదేశ్లో మైనర్ బాలికపై అత్యాచారం..
- కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్..
- మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ మధురలో దళిత బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాలికను రోడ్డు పక్కన తోసేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 13 ఏళ్ల బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా మహిళా ఆస్పత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలనాన్ని మేజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు ఎస్పీ త్రిగుణ్ బిసెన్ తెలిపారు.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
Read Also: Yahya Ayyash: ‘‘ది ఇంజనీర్: యాహ్య అయ్యాష్’’ని ఇజ్రాయిల్ సెల్ఫోన్ బాంబుతో ఎలా చంపేసింది..?
మైనర్ బాలిక టిఫిన్ కోసం సామాన్ తీసుకుని వచ్చేందుకు స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. షాపులో ఉన్న నీరజ్ అనే వ్యక్తి బాలికకు మత్తుమందు కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చాడు. నీళ్లు తాగిన బాలికకు తల తిరగడంతో పాటు స్పృహతప్పి పోయింది. నీరజ్ తన స్నేహితులు శైలేంద్ర, మరో సహచరుడు బాలికను కారులో తీసుకెళ్లారు. బాలిక పాక్షిక స్పృహలో ఉన్న సమయంలో, కదులుతున్న కారులో అత్యాచారం చేసి, బర్సానా రోడ్ ఫ్లై ఓవర్ కింద పడేసి పారిపోయారు. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని త్రిగుణ్ బిసెన్ తెలిపారు.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?