UP: యంత్రంతో 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్లలోపు యువతగా మారుస్తామని చెప్పి.. ఆపై…
- యవ్వనంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఆ ప్రజల కోరికను సద్వినియోగం చేసుకున్న జంట
- 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్లలోపు యువతగా మారుస్తామని చెప్పి
- రూ. 35 కోట్లకు టోకరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యవ్వనంగా ఉండాలని అందరికీ ఉంటుంది. తమ యవ్వనాన్ని నిలుపుకోవాలనే ప్రజల కోరికను ఓ జంట సద్వినియోగం చేసుకుంది. వారిని మోసం చేయడానికి పథకం పన్నింది. ఇజ్రాయెల్ యంత్రంతో 60 ఏళ్లు పైబడిన వృద్ధులను 25 ఏళ్ల యువకులుగా మారుస్తానని చెప్పి సుమారు రూ. 35 కోట్లను మోసగించిన భార్యాభర్తలపై కేసు నమోదైంది. ప్రజలను మోసం చేసిన ఈ భార్యాభర్తలు, ఈ ఇజ్రాయెల్ యంత్రం ఆక్సిజన్ థెరపీ చేస్తుందని, దానివల్ల వృద్ధులు యువకులు అవుతారని అందరినీ మోసం చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో చోటుచేసుకుంది.
READ MORE: Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఈ దొంగ పథకానికి ప్రజలు ఆకర్శితులయ్యారు. కొద్ది రోజుల్లోనే వేలాది మంది సంస్థలో సుమారు రూ. 35 కోట్లు డిపాజిట్ చేశారు. చాలా మంది ఈ మెషీన్లో ఆక్సిజన్ థెరపీని కూడా తీసుకున్నారు. కానీ ఎవ్వరికీ మంచి ఫలితం రాలేదు. చివరకు తాము మోసపోతున్నామని తెలియడంతో ఆ భార్యాభర్తలను నిలదీయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు వీరిద్దరిపై డాక్టర్ రేణు చందేల్ పోలీస్ రిపోర్ట్ దాఖలు చేశారు. పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE:Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిటిషన్
విషయం ఏంటంటే.. స్వరూప్ నగర్లో నివాసం ఉంటున్న రాజీవ్ దూబే, అతని భార్య రష్మీ దూబే సాకేత్ నగర్లో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. వృద్ధులను యువతగా మార్చేందుకు ఇజ్రాయెల్ నుంచి ఓ యంత్రాన్ని దిగుమతి చేసుకున్నామని వారిద్దరూ పేర్కొన్నారు. ఈ యంత్రం వృద్ధులకు కొంత థెరపీని అందించడం ద్వారా వారిని 60 నుంచి 25 సంవత్సరాల వరకు యువకులను చేస్తుందని నమ్మించారు. దీంతో చాలా మంది నుంచి ఈ సంస్థకు ప్రోత్సాహం లభించింది. రేణు సింగ్ కూడా తన మెషీన్ను నమ్మి తన తరపున వందలాది మందిని యూనిట్లుగా ఏర్పాటు చేసి తన సంస్థలో డబ్బు పెట్టుబడి పెట్టించారు.
READ MORE:Chiranjeevi: గిన్నీస్ రికార్డు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
చికిత్స కోసం భార్యాభర్తలు కొందరి నుంచి రూ.6000, మరికొందరి నుంచి రూ.90000 తీసుకున్నారు. కానీ చికిత్స కారణంగా ఎవరూ లాభపడలేదు. ఈ వ్యక్తులు తమను మోసం చేశారని తెలుసుకున్న ప్రజలు, వారు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయితే దంపతులు తమ ఫ్లాట్కు తాళం వేసి అదృశ్యమయ్యారు. ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు రేణు సింగ్ చెప్పారు. అందుకే పోలీసు కమిషనర్ను కలిసి కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!