ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్లో వైస్ఛైర్పర్సన్గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపుర్లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకోవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కదులుతున్న కారులో మోడల్పై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తి.. సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని నమ్మించి ఆగస్టు 28న లక్నోకు పిలిచి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇలా కారు, హోటల్లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి…
Wife Harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని రికార్డ్ చేశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తాను పెళ్లి వల్ల ఎంత నరకం అనుభవించానే విషయాన్ని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంటనీరు తెప్పిస్తోంది.
Wolf Attacks: ఉత్తర ప్రదేశ్ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతున్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.
Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్లు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నారు. బ్యాంక్ రుణం చెల్లించకపోవడంతో కుటుంబాన్ని వేధించారు. చివరకు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని హాపూర్లో చోటు చేసుకుంది. సోమవారం 18 ఏళ్ల కుమార్తెతో సహా దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. లోక్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురిచేయడంతోనే వారు ఈ చర్యలకు ఒడిగట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
Moradabad: గాఢమైన ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లి చావు దెబ్బలుతిన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్లో చోటు చేసుకుంది. ప్రియుడు బురఖా ధరించి తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. అయితే, స్థానికులకు అనుమానం రావడంతో బురఖా తీసేసి చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. మొరాదాబాద్లో పట్టపగలే ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెటా (ఫేస్బుక్) ఏఐ కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణం రక్షించబడింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు కారణాలను ఓ వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి.
Kannauj rape case: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత నిందితుడిగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్లోని అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన ఎస్పీ నేత నవాబ్ సింగ్ యాదవ్ యొక్క డీఎన్ఏ నమూనా, బాలిక నుంచి సేకరించిన డీఎన్ఏతో మ్యాచ్ అయింది. దీంతో ఈ కేసులో అతడి చుట్టూ మరింత ఉచ్చు బిగిసింది.