Crime: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కోల్కతా డాక్టర్ ఘటన ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే పలు ప్రాంతాల్లో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. చాలా వరకు లైంగిక దాడులు తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయి.
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు.
యూపీలోని బల్రామ్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. నిందితుడు భర్త హత్యకు ముందు హాలీవుడ్ క్రైం సినిమాను చూసి భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా.. ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి, ఆ పార్ట్స్ ను పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరిగింది.
UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
18 people injured as bus over turns in UP Shahjahanpur: ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. ఎద్దును కాపాడే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. షాజహాన్ పూర్ జిల్లా సీతాపూర్ నుంచి హరిద్వార్ కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారిపై ఎద్దును కాపాడే క్రమంలో అదుపు తప్పి బోల్తా…
పొలాల్లోకి తీసుకెళ్లి ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. రాత్ గ్రామంలో ముగ్గురు యువకులు బాలికను బైక్పై బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆ యువతిని వదిలేసి పారిపోయారు.
New Social Media Policy: ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్తో సహా ఇతర ప్లాట్ఫారమ్లలో కంటెంట్ను నియంత్రించాలనే లక్ష్యంతో కొత్త సోషల్ మీడియా విధివిధానానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఓ వివాహిత ముగ్గురితో అక్రమసంబంధం పెట్టుకుంది. తనను ప్రాణంగా ప్రేమించిన యువకుడి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరిగింది. ఈ ఘటన పోలీసులను షాక్ కు గురి చేసింది.
యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం…