YouTube: యూట్యూబ్లో చూసి సొంత వైద్యం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఓ వ్యక్తి, తన కడుపు నొప్పికి సొంతగా ‘‘ఆపరేషన్’’ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్లో చూస్తూ, తనకు తాను సర్జరీ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.
Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో…
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు.
Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం యూపీ ప్రయాగ్రాజ్కి వచ్చారు. అక్కడే ఒక హోమ్ స్టేలో బస చేశారు.
Mahakumbh 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి మహా కుంభమేళా జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రతిరోజూ లక్షలాది మంది మహా కుంభమేళాకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
Mahakumbh 2025 : మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు.
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.
Stampede in Mahakumbh : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు.
Crime: రాజస్థాన్కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్లో తన గర్ల్ఫ్రెండ్తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్యమైంది. అతడితో వచ్చిన మహిళ కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.