CRIME: గర్ల్ఫ్రెండ్, భార్య దానికి నిరాకరించారని.. 13 ఏళ్ల బాలుడిపై దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో నిందితుల పార్ట్నర్స్ శృంగారం చేయడానికి నిరాకరించారు. దీంతో మార్చి 5న జిమ్కి వెళ్తున్న బాలుడిని నిందితులు అజార్, హుస్సేని కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి కట్టేసి బెదిరించినట్లు డీసీపీ బ్రజేంద్ర ద్వివేది వెల్లడించారు.
ఆ తర్వాత బాలుడిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు బిగించి చంపారు. మృతదేహాన్ని బావిలో పడేసినట్లు నిందితుడు హుస్సేని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వారు అతనిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బావిలో పడేశారని హుస్సేని అరెస్టు తర్వాత పోలీసులకు చెప్పాడు. అజార్ ఇంకా పరారీలో ఉన్నాడు మరియు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Read Also: Madness for reels: ఇదేం పిచ్చి.. రీల్స్ కోసం గ్యాస్ సిలిండర్ లీక్, ఇళ్లు ధ్వంసం..
అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరైన హుస్సేని విచారణలో.. ‘‘నా గర్ల్ఫ్రెండ్, అజార్ భార్య రంజాన్ సమయం కావడంతో తమతో వారు సెక్స్ చేయడానికి నిరాకరించారు. కానీ మేము వారితో సెక్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాము. రంజాన్ ముగిసే వరకు ఈ ఇద్దరూ మాతో శృంగారం చేయకుంటే ఎలా అని ఆలోచించి, మేము 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాము’’ అని చెప్పాడు.
ఇద్దరు నిందితులు కూడా బాలుడిని కాల్-గర్ల్ ని కలవడానికి తీసుకెళ్తున్నామని మాయమాటలు చెప్పారు. మార్చి 5న బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం, బాలుడి నివసించే ప్రాంతంలోనే నివసించే హుస్సేని, బాలుడి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, కిడ్నాపర్లు ఏదైనా మెసేజ్ పంపారా..? అని, వారి ఫోన్లు చెక్ చేసుకోమని చెప్పాడు. కుటుంబీకులు మొబైల్ ఫోన్ చెక్ చేయగా, బాలుడి మామ ఫోన్లో రూ. 10 లక్షలు డబ్బు కావాలంటూ కోరుతూ మెసేజ్ కనిపించింది.
బాలుడు కిడ్నాపైన రోజు రాత్రి హుస్సేనీ అదృశ్యమైనట్లు, తెల్లవారుజామున మళ్లీ ఇంటి వద్దే ఉన్నట్లు బాలుడి కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించిన తర్వాత, అతడు చెప్పే మాటల్లో తేడాలు కనిపించాయి. చివరకు హుస్సేని లొంగిపోయి, ఆ బాలుడి హత్యలో తనతో పాటు అజార్ ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. హుస్సేనిని అరెస్ట్ చేయగా, అజార్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగున్నట్లు డీసీపీ తెలిపారు.
- Tags
- crime
- Crime News
- kanpur
- telugu news
- UP
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!