CRIME: గర్ల్ఫ్రెండ్, భార్య దానికి నిరాకరించారని.. 13 ఏళ్ల బాలుడిపై దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRIME: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. తమ భాగస్వాములు సెక్స్కి నిరాకరించడంతో, ఇద్దరు వ్యక్తులు 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో నిందితుల పార్ట్నర్స్ శృంగారం చేయడానికి నిరాకరించారు. దీంతో మార్చి 5న జిమ్కి వెళ్తున్న బాలుడిని నిందితులు అజార్, హుస్సేని కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి కట్టేసి బెదిరించినట్లు డీసీపీ బ్రజేంద్ర ద్వివేది వెల్లడించారు.
ఆ తర్వాత బాలుడిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు బిగించి చంపారు. మృతదేహాన్ని బావిలో పడేసినట్లు నిందితుడు హుస్సేని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వారు అతనిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బావిలో పడేశారని హుస్సేని అరెస్టు తర్వాత పోలీసులకు చెప్పాడు. అజార్ ఇంకా పరారీలో ఉన్నాడు మరియు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
Read Also: Madness for reels: ఇదేం పిచ్చి.. రీల్స్ కోసం గ్యాస్ సిలిండర్ లీక్, ఇళ్లు ధ్వంసం..
అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరైన హుస్సేని విచారణలో.. ‘‘నా గర్ల్ఫ్రెండ్, అజార్ భార్య రంజాన్ సమయం కావడంతో తమతో వారు సెక్స్ చేయడానికి నిరాకరించారు. కానీ మేము వారితో సెక్స్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాము. రంజాన్ ముగిసే వరకు ఈ ఇద్దరూ మాతో శృంగారం చేయకుంటే ఎలా అని ఆలోచించి, మేము 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాము’’ అని చెప్పాడు.
ఇద్దరు నిందితులు కూడా బాలుడిని కాల్-గర్ల్ ని కలవడానికి తీసుకెళ్తున్నామని మాయమాటలు చెప్పారు. మార్చి 5న బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం, బాలుడి నివసించే ప్రాంతంలోనే నివసించే హుస్సేని, బాలుడి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, కిడ్నాపర్లు ఏదైనా మెసేజ్ పంపారా..? అని, వారి ఫోన్లు చెక్ చేసుకోమని చెప్పాడు. కుటుంబీకులు మొబైల్ ఫోన్ చెక్ చేయగా, బాలుడి మామ ఫోన్లో రూ. 10 లక్షలు డబ్బు కావాలంటూ కోరుతూ మెసేజ్ కనిపించింది.
బాలుడు కిడ్నాపైన రోజు రాత్రి హుస్సేనీ అదృశ్యమైనట్లు, తెల్లవారుజామున మళ్లీ ఇంటి వద్దే ఉన్నట్లు బాలుడి కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించిన తర్వాత, అతడు చెప్పే మాటల్లో తేడాలు కనిపించాయి. చివరకు హుస్సేని లొంగిపోయి, ఆ బాలుడి హత్యలో తనతో పాటు అజార్ ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. హుస్సేనిని అరెస్ట్ చేయగా, అజార్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగున్నట్లు డీసీపీ తెలిపారు.
- Tags
- crime
- Crime News
- kanpur
- telugu news
- UP
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!