Stampede in Mahakumbh : మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి, ప్రధాని మోదీ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మహా కుంభమేళా పరిస్థితి గురించి మాట్లాడి పరిస్థితిని సమీక్షించి, తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించారు. సంగం వద్ద జరిగిన తొక్కిసలాట గందరగోళం, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించింది. చాలా అఖారాలు రాజ స్నానాన్ని రద్దు చేసుకున్నాయి. మౌని అమావాస్య నాడు పవిత్ర స్నానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా చాలా మంది గాయపడినట్లు సమాచారం.
#MahaKumbh2025 | PM Modi spoke to UP CM Yogi Adityanath about the situation at the Maha Kumbh Mela, reviewed the developments, and called for immediate support measures. pic.twitter.com/T5mQCQM7M0
Also Read
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
— ANI (@ANI) January 29, 2025
తొక్కిసలాటపై కుంభమేళా అథారిటీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా మాట్లాడుతూ, “సంగం నోస్ వద్ద అడ్డంకి విరిగిపోయిన తర్వాత తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనలో కొంతమంది గాయపడ్డారు, వారు చికిత్స పొందుతున్నారు. ఎవరూ సీరియస్గా లేరు.’’ అని ప్రకటించారు.
Read Also:Stampede in Mahakumbh Live Up Dates : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. లైవ్ అప్ డేట్స్
అఖిల భారతీయ అఖార పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ.. “జరిగిన సంఘటన మాకు చాలా బాధ కలిగించింది. మాతో వేలాది మంది భక్తులు ఉన్నారు… ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అఖారాలు ఈరోజు స్నానంలో పాల్గొనకూడదని మేము నిర్ణయించుకున్నాము. ఈరోజు కాకుండా వసంత పంచమి నాడు స్నానం చేయడానికి రావాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తులు సంగం ఘాట్ చేరుకోవాలని, బదులుగా పవిత్ర గంగానది ఎక్కడ కనిపించినా స్నానం చేయాలని కోరుతున్నా’’ అన్నారు.
మహా కుంభ మేళా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. ‘ఇది విచారకరమైన సంఘటన, ఏది జరిగినా అది సరైనది కాదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అఖారా పరిషత్ అమృత్ స్నానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
Read Also:Ind vs Eng 3rd T20: వరుణ్ చక్రవర్తి మెరిసినా.. మూడో టీ20లో భారత్కు తప్పని ఓటమి
తాజావార్తలు
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!