ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ను ఎయిర్ అంబులెన్స్లో పాకిస్థాన్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఆయనను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ముషారఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వదేశానికి ఆయనను తరలించేందుకు వీలు కల్పిస్తామరి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట…
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…
ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్…
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షేక్ ఖలీఫా అబుదాబి పాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. యూఏఈ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్,…
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా అనే పదం బాగా వినిపిస్తున్నది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వచ్చింది అంటే వారు యూఏఈ పౌరసత్వం పొందినట్టే అనుకోవచ్చు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు గోల్డెన్ వీసాను అందిస్తుంటారు. ఇలాంటి వారందరికీ గోల్డెన్ వీసా అందిస్తారా అంటే లేదని చెప్పాలి. విద్యార్థులకైతే ప్రతిభ ఆధారంగా గోల్డెన్ వీసాలను అందిస్తారు. అదే కళాకారులకైతే వారి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలి. అదేవిధంగా…
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. రోజువారీ కేసులు లక్షల్లోనమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదవుతున్నా తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారు. అయితే, యూఏఈలో పనిచేస్తున్న ఓ భారతీయ ఫ్రంట్లైన్ వర్కర్ ఆరు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. అప్పటి నుంచి కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆసుపత్రిలో గత ఆరునెలలుగా చికిత్స పొందుతూ ఎట్టకేలకు కోలుకున్నాడు. గురువారం రోజున ఆసుపత్రి…
ఇటీవలే యూఏఈ రాజధాని అబుదాబీలో డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు. యెమన్కు చెందిన హుతీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల రోజులపాటు డ్రోన్లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డ్రోన్లను ఎరగవేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఎవరైనా సరే డ్రోన్లను ప్రయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్ దాడులకు తమ పనేనని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్పోర్ట్లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్కు చెందిన హౌతీ…