UAE: భారత గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడోంది. ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్ లెటర్స్, ఆహార భద్రత కోసం కొన్ని దేశాలకు మినహా అన్ని దేశాలకు ఇండియా గోధుమలను బ్యాన్ చేసింది.
కాగా ఇండియా నుంచి దిగుమతి అయ్యే గోధుమలను మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా 4 నెలల పాటు ఎగుమతులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) బ్యాన్ విధించింది. అంటే ఇండియా నుంచి వచ్చే గోధుమలను మళ్లీ యూఏఈ నుంచి ఏ ఇతర దేశానికి కూడా ఎగుమతి చేయకూడదని అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యూఏఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా దేశీయ అవసరాల కోసం యూఏఈకి గోధుమలు ఎగుమతి చేయడానికి భారత్ అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
మే 14న భారత దేశంల గోధుమల ఎగుమతులను నిషేధించింది. అయితే క్రెడిట్ లైన్స్, కొన్ని దేశాలకు మాత్రమే గోధుమలను ఎగుమతి చేస్తోంది. అప్పటి నుంచి దాదాపుగా 4,69,202 టన్నుల గోధుమల రవాణా చేయడానికి ఇండియా అనుమతించింది. భారత్ నుంచి యూఏఈకి వచ్చిన గోధుమలను తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూఏఈ, ఇండియా ఫిబ్రవరిలో విస్తృత వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది ఒక దేశం వస్తువులపై మరో దేశం సుంకాలను తగ్గించుకోవాలని, ఐదు ఏళ్లలో వార్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!