పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం…
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సుధ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ సెట్ లో అందరిముందు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ” నా…
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా…
యూఫరియా అంటేనే అత్యంత ఆనందోత్సాహం. ఆ టైటిల్ ను టీనేజ్ డ్రామా కోసం ఏ ముహూర్తాన నిర్ణయించారో కానీ, యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెచ్.బి.ఓ. లో యూఫరియా సీజన్ 2 , జనవరి 9 న మొదలయింది. యువతను కిర్రెక్కిస్తోంది. 2019 జూన్ 16న తొలి సీజన్ మొదలై, అమెరికా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ సీరిస్ అలరించింది. నిజానికి యూఫరియాకు స్ఫూర్తి అదే పేరుతో ఇజ్రాయెల్ లో రూపొందిన టీనేజ్ డ్రామా.…
సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు. ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల…
కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గత యేడాది అమేజాన్ ప్రైమ్ సంస్థ 13 బిలియన్ డాలర్లు వెచ్చించిందట. ఈ విషయాన్ని ఇటీవల సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి తెలిపారు. పదమూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 96 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం చూస్తే… ఎవరైనా అమ్మో అంటూ ఆశ్చర్యపోక మానరు. కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలా అంటూ చాలామంది నోరు వెళ్ళ బెడతారు.…
విక్రమార్కుడు, మర్యాద రామన్న, పటాస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాణి. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణి కెరీర్ ప్రారంభంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అవకాశం ఇస్తానని చెప్పి ఒక దర్శకుడు తనను మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ” నేను మొదట సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ దగ్గరకి వెళితే.. నేను అందంగా ఉండనని, నల్లగా ఉన్నానని, యాక్టింగ్ కి…
ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బరువు పెరిగిన ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే అధిక బరువు ఇల్లీ బేబీ కి సంసాయిగా మారిందనే చెప్పాలి.…
మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమిన ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా కాకతీయ ఇన్నోవేటివ్స్ తో కలసి దొండపాటి సినిమాస్ నిర్మిస్తున్న తొలి సినిమా పూజ కార్యక్రమం యాదాద్రి లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బ్రీచ్ కాండీ హాస్పిటల్ వైద్యులు ప్రతీత్ సమదాని శనివారం తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత జనవరిలో లతా మంగేష్కర్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే నెల 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సంజ్ఞలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి…