యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్.…
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమాలోని రాధిక పాత్ర ఆకట్టుకుంటుందని చెబుతోంది హీరోయిన్ నేహా శెట్టి. రాధిక పాత్రలో తను నటించిన ‘డిజె టిల్లు’ 11న థియేటర్ లలో సందడి చేయనుంది.’సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. శుక్రవారం మీడియాతో ‘డిజె టిల్లు’ విశేషాలను, అందులో నటించిన తన అనుభవాలను షేర్ చేసుకుంది నేహా శెట్టి. ‘బాల్యం నుంచే నటి కావాలనే కోరిక…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.…
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చేవారు సక్సెస్ అయ్యేవరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరుముఖ్యంగా హీరోయిన్లు.. మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోక మానరు. ఏదో ఒక సందర్భంలో వారు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టిందని, ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు…
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమాకు సూపర్ పార్ట్ నర్ లభించారు. తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ కాబోతోంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా ‘రాధేశ్యామ్’…
సూర్య నటించిన తాజా సినిమా ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి ఇతర ముఖ్య పాత్రధారులు. ఇమామ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. సూర్య బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ లో ‘పసంగ2’ సినిమాను దర్శకత్వం వహించిన పాండిరాజ్ 2019లో సొల్లాచ్చి సెక్యువల్ అసాల్ట్ కేస్…
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద…
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భీమ్లా న్యాక్ విడుదల విసాయంలో ఆయన పోరాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆయన ప్రస్తుతం డీజే టిల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నిన్న లాంచ్ చేసిన విషయం విదితమే. ఈ వేడుకలో నాగవంశి చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్…