డేంజరస్గా మారిన రాయల చెరువు..హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం, నెన్నూరులో అప్రమత్తత ప్రకటించారు. వీటితోపాటు గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో అలర్ట్ ప్రకటించారు. అలాగే, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరు వంటి పల్లెలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు.
Also Read
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
రాయలచెరువుకు గండి పడితే భారీ ప్రమాదం సంభవించే అవకాశం వుంది. గండిని పూడ్చే అవకాశం లేదంటున్నారు అధికారులు. చెరువు చుట్టూ వందలాది గ్రామాలు వున్నాయి.బలిజపల్లి, మిట్టురు, కమ్మకండ్రిక ,సి రామాపురం,రామచంద్రాపురంవంటి దిగువ గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. గండి పడితే తిరుచానురు స్వర్ణముఖి వరకు నీటి ప్రవాహం వుండే అవకాశం వుంది. దీంతో రాయలచెరువు ప్రాంతానికి చేరుకుంటున్నారు పోలీసులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సేవలందించేలా సిద్దం చేస్తున్నారు అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు. అవసరమైతే హెలికాప్టర్లు రంగంలోకి దింపే యోచనలో వున్నారు అధికారులు, నిన్నటి నుంచి రాయలచెరువుకు ప్రమాదం పొంచి వుందంటూ ప్రజల్ని హెచ్చరిస్తూనే వుంది ఎన్టీవీ.
రాయలచెరువు సమీప గ్రామాలు ఇవే!
సంజీవరాయపురం, బలిజపల్లి, పివి పురం, గంగమాంబపురం, రామిరెడ్డి పురం, గంగిరెడ్డి పల్లి, పద్మావళ్ళిపురం, కమ్మ కండ్రిగ, నడవలూరు, నెన్నూరు, కట్ట కింద వెంకటాపురం, నాగూర్ కాలనీ, కుంట్రపాకం, వెంకటరామాపురం, కమ్మపల్లి,గణేశ్వర పురం, సొరకాయల పాల్యం, వేమూరు, కాయం పేట, వడమాలపేట, తిరుచానూరు వంటి గ్రామాలు వున్నాయి. దాదాపు యాబైవేల మంది జనాభా ఇక్కడ నివశిస్తున్నారు. పరిస్థితి ఎలా మారినా అప్రమత్తంగా వున్నామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!