ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం అధికారులతో హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈజేహెచ్ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12…
నల్లగొండ జిల్లాలో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ టీచర్ ను సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురిచేశారు. బెంగుళూరులో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినావని అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేశారు సైబర్ నిందితులు. అరెస్ట్ కావద్దు అంటే రూ.18 లక్షలు తమ ఎకౌంట్ లో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధిత రిటైర్డ్ టీచర్ రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల ఎకౌంట్ లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. డబ్బు బదిలీ చేసేందుకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం రేపిన ఆత్మహత్య కేసులో లోతైన దర్యాప్తులో నిజాలు బయటపెట్టారు పోలీసులు. ప్రియుడు, స్నేహితులతో కలిసి భార్య హత్యకు కుట్రపన్నిందని వెల్లడించారు. భర్తను గొంతు నులిమి హతమార్చినట్లు తెలిపారు. వెంగళరావు కాలనీలో ధరవత్ హరినాథ్ (39) హత్య కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై దాడి చేసి గొంతు నులిమి హతమార్చారు నిందితులు. తర్వాత ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. భార్య దరావత్ శ్రుతిలయ ప్రధాన…
ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు నకిలీ నోట్ల ప్రింటింగ్ కు పాల్పడుతున్నారు. దొంగనోట్లను ముద్రించి గుట్టుచప్పుడు కాకుండా చలామణిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో దొంగ నోట్లు కలకలం రేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల చలామణి అయినట్లు అధికారులు గుర్తించారు. కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వెళ్లిన జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు వద్ద రూ.2 లక్షల 8వేల…
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కబ్జాదారుల నుంచి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని రక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ లోని స్థలాలను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతోంది. ఈ క్రమంలో పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు…
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..! విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో…
ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర…
* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదో టీ-20.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి * సుప్రీంకోర్టులో ఇవాళ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న కేసు విచారణ.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని తీర్పు ఇచ్చిన స్పీకర్ * ఢిల్లీ పర్యటనలో సీఎం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై…