Telangana : ఈ-కేవైసీ లేకపోతే రేషన్ కట్.!
- ఈ-కేవైసీ తప్పనిసరి.. పూర్తికాకపోతే రేషన్ నిలిపివేత
- డిసెంబర్ 31 గడువు..
- బయోమెట్రిక్ సమస్యలతో ఈ-కేవైసీకి అడ్డంకులు
- కొత్త రేషన్ కార్డుదారులకు సంక్షేమ పథకాలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు సూచనలు ఇచ్చినా, ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియను పూర్తిచేయకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేస్తామని మరోసారి హెచ్చరించారు.
రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తయ్యిన వారికే రేషన్ సరఫరా జరుగుతుందని, లేకపోతే కోటా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
గత రెండేళ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అప్డేట్ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31లోపు మిగిలినవారంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్ కోటా ఉండదని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రేషన్ డీలర్లు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొందరి బయోమెట్రిక్ వేలిముద్రలు ఈ-పాస్ యంత్రంలో నమోదు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు కాకపోతే తమ తప్పుగా ఎలా పరిగణిస్తారని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ గడువును డిసెంబర్ 31 తర్వాత కూడా పొడిగించాలని పలువురు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డుదారులకు ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతున్నప్పటికీ, కొత్త కార్డులు పొందిన వారికి అవి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Shocking Incident: రాజస్థాన్ లో దారుణం.. ప్రయాణికుడిపై కండక్టర్ దాడి..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!