Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
పిఠాపురం కమిషనర్పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా…
ఆ లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతోందా? పొలిటికల్ సీన్లో కాస్త ఛేంజ్ కనిపిస్తోందా? పద్ధతులకు, పాలిటిక్స్కు లింక్ పెట్టొద్దన్న ఆనవాయితీని ఇద్దరూ కొనసాగిస్తున్నారా? తోలు తీస్తానని ఒకరు, ఉరి తీయాలని మరొకరు వీరావేశంతో ఇచ్చే స్టేట్మెంట్స్ను అక్కడికే పరిమితం చేయాలనుకుంటున్నారా? ఎవరా ఇద్దరు ముఖ్య నాయకులు? వాళ్ళ మధ్య సంప్రదాయాల ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. రాజకీయంగా ఇద్దరూ గండరగండులే. తెలంగాణ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తున్నవారే. సీఎం రేవంత్రెడ్డి,…
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు అల్రెడీ సిద్ధమైపోతున్నారా? వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చింది ఎవరు? అధికారికంగా ఎక్కడా ఆ వాసనే లేని టైంలో… కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే… ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో…
అవకాలు చెవాకులు పేలొద్దు.. జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారు..? కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ…
వేడుకలను విషాదంగా మార్చేస్తోంది చైనా మాంజా. నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా 2017లో దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చైనా మాంజా వాడకానికి అడ్డుకట్టపడడం లేదు. చైనా మాంజా…
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు. రాత్రికి రాత్రే 200 మందికి పైగా దుండగులు ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రేలింగ్ పైపులతో డీసీఎం, ట్రాలీ ఆటోల్లో అర్థరాత్రి వేళ వచ్చి హల్ చల్ చేశారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడలను తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేసి వచ్చారు. Also…
రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. పిల్లలపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు దుండగులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అశ్వరావుపేట మండలం ఊట్లపల్లిలో చోటుచేసుకుంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. బాలిక ఐదో నెల గర్భవతి అని వైద్యులు తేల్చారు. స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు…