Telangana : పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ‘కోటి’ భరోసా..!
- పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు 'కోటి' బీమా సదుపాయం
- రాష్ట్రవ్యాప్తంగా 5.14 లక్షల ఉద్యోగులకు నేరుగా లాభం
- సింగరేణి, విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే అమలు చేసిన మోడల్
- సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసే క్రమంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని, అందుకే వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Youtube Searchలో భారీ మార్పులు.. ఇకపై Short వీడియోలను దాచిపెట్టవచ్చు.!
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
ఈ భారీ బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో ప్రభుత్వం ఇప్పటికే విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపిందని, ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలను సైతం ప్రతి నెలా క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ ప్రమాద బీమా పథకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న వేగం ఉద్యోగ వర్గాల్లో హర్షాన్ని కలిగిస్తోంది.
గతంలోనే సింగరేణి, ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ , ఎన్పీడీసీఎల్ వంటి కీలక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమాను ప్రభుత్వం విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చొరవతో ఇప్పటికే సింగరేణిలో పనిచేస్తున్న 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, విద్యుత్ సంస్థల్లోని 71,387 మంది ఉద్యోగులకు రక్షణ కవచం లభించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు కూడా ఈ 1.02 కోట్ల బీమాను వర్తింపజేయడం ద్వారా దేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్నామని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు. ఈ బీమా పథకం ప్రమాదవశాత్తు ఏదైనా అనర్థం జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి చెక్.. 75 బస్సులపై కేసులు
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!