తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్…
మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం , అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించే ఫ్రేమ్డ్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ బోర్డులలా కాకుండా, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం , వారి సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ శిలాఫలకాలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల శైలిని ప్రతిబింబించేలా, రాయిని సహజంగా ఉంచి దానిపైనే…
వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు.. అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని…
బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ యువతి వీడియో తీసింది. యువతి నిందారోపణ తట్టుకోలేక బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి.. వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను అలాంటి స్వభావం గల వాడిని కాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీపక్. మృతుడిని కోజికోడ్లోని గోవిందపురంలో నివసిస్తున్న పుతియారాకు చెందిన దీపక్…
దొంగతనానికి వెళ్లి బయటికి రాలేక అక్కడే ఇరుక్కుపోయిన సంఘటనలు చూశాం కదా. మరికొందరు మద్యం మత్తులో దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయి యజమానులకు పట్టుబడిన కేసులు ఉన్నాయి. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ తాగిన మైకంలో బయటకు వెళ్ళ లేక ఇంట్లోనే పడుకున్నాడు. యజమాని వచ్చి తాళం తీసి చూసే వరకు ఇత్తడి,ఇనుప సామాన్లు సంచిలో నింపుకుని పడుకుని కనిపించిన వైనం.…
పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ…
సిద్దిపేటలో ఆదర్శ్ నగర్ స్ట్రీట్ నంబర్ 7 లో దారుణం చోటుచేసుకుంది. భార్య శ్రీలతపై అనుమానంతో భర్త ఎల్లయ్య కత్తితో పొడిచి చంపాడు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, పిల్లలు కూడా తనకి పుట్టలేదన్న అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య శ్రీలత(35) ని కత్తితో పొడిచి చంపిన భర్త ఎల్లయ్య.. అనంతరం కూతురు(15), కొడుకు(12)పై కత్తితో దాడికి యత్నించాడు. తండ్రి దాడిలో తప్పించుకుని పారిపోయిన కుమారుడు. అనంతరం గడ్డి మందు తాగి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు…
* WPLలో నేడు గుజరాత్ వర్సెస్ బెంగళూరు.. వడోదర వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.50 గంటలకకు జ్యురిచ్ ఎయిర్పోర్టుకు చంద్రబాబు.. * మేడారంలో రెండో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో ముక్కులు చెల్లింపు.. * 251 కోట్లతో…
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన…