ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
LRS Date Extended: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. మునుపటి గడువు మార్చి 31వ తేదీతో పూర్తవుతుండడంతో, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లింపు వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. Read Also: Siddaramaiah: ఇరకాటంలో కర్ణాటక సీఎం.. ముడా…
Ponguleti Srinivas Reddy : గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు 400 ఎకరాల భూమి విషయాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు అప్రసక్తమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, ఈ భూములను తమ అనుబంధ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసిన చీకటి ఒప్పందాల వెనుక ఆ పార్టీనే ఉందని ఆరోపించారు. గచ్చిబౌలి భూముల వివాదం పెరుగుతున్న నేపథ్యంలో…
Bhatti Vikramarka : హెచ్సీయూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు లు ప్రొఫెసర్ హరగోపాల్.. ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో కేసు గెలిచామన్నారు. ప్రయివేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా వేల కోట్ల భూమిని కాపాడామని, ప్రజల ఆస్తిని కాపాడిన తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రయివేటు రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు…
Duddilla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూముల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద వివాదం రేగింది. ఈ వివాదం నేపథ్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు లు ప్రొఫెసర్ హరగోపాల్.. ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “HCU భూముల విషయంలో కొన్ని అపోహలు, అనుమానాలు వ్యాప్తి అవుతున్నాయి. ఆ తతంగంలో బీజేపీ, బీఆర్ఎస్ పక్షాలు…
Harish Rao : రైతు భరోసా అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను…
Addanki Dayakar : ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పక్కన ఉన్న సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పోరాటం చేసి సాధించారని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, న్యాయపరమైన మార్గంలోనే భూమిని రాబట్టేందుకు కాంగ్రెస్…
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి…
Komatireddy Venkat Reddy : పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ సాహసోపేత నిర్ణయమని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇవాళ NTVతో మాట్లాడిన ఆయన, ఈ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల పంపిణీ విషయంలో…
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ గారి ఉగాది పంచాంగ శ్రవణం అద్భుతంగా సాగింది. అలాగే బెంగళూరు నాయర్ సిస్టర్స్ చేసిన విష్ణువైభవం భరత నృత్యం, ప్రధానమంత్రి బాల్ పురస్కార్ గ్రహీత పెండ్యాల లక్ష్మీప్రియ బృందం చేసిన విశ్వనాధామృతం కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. నిహారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.