Salman Ali Agha: “మేము రోల్ మోడల్స్”.. భారత్–పాక్ మ్యాచ్ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ రియాక్షన్..
Salman Ali Agha: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 8 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ జట్టుకు పెద్ద సవాలుగా మారింది. భారత్తో మ్యాచ్ బహిష్కరణ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి మైదానంలో గెలుపుపైనే దృష్టి పెట్టాలని కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పష్టం చేశాడు. “బయట ఏం జరుగుతుందో మేం ఎక్కువగా పట్టించుకోం. జట్టుగా మేం వాటి గురించి మాట్లాడం. అలా చేస్తేనే మన ఆటపై ఫోకస్ పెట్టగలం” అని అన్నాడు. భారత్తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్కు రావడం నిరాకరించడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్కు రెండు పాయింట్లు నష్టమవుతాయి. దాంతో గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై స్పందించిన సల్మాన్ “ఇలాంటి వివాదాలు ఆటకు మంచివి కావు. మాకు వ్యక్తిగతంగా బాధగా అనిపించకపోయినా.. క్రికెట్ కోణంలో ఇలా జరగడం మంచిది కాదు. మేము రోల్ మోడల్స్లాంటివాళ్లం. మేము ఏం చేస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే ఇలాంటి విషయాలు దూరంగా ఉండాలి.” అని చెప్పాడు.
READ MORE: Team India: టీ20 వరల్డ్కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
గ్రూప్లో భారత్తో పాటు నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా జట్లు ఉన్నాయి. భారత్ మ్యాచ్ లేకపోవడంతో ఈ మూడు జట్లతో జరిగే పోరాటాలే పాకిస్థాన్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే దీనిపై ఎలాంటి ఒత్తిడి లేదని సల్మాన్ చెప్పాడు. “ఐసీసీ టోర్నమెంట్కు వచ్చామంటే దాదాపు అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే. మేము కూడా అదే ఉద్దేశంతో వచ్చాం. ప్రతి మ్యాచ్లో మా బెస్ట్ ఇస్తాం” అన్నాడు. కొలంబోలో జరగబోయే మ్యాచ్లకు వాతావరణం ఓ సమస్యగా మారవచ్చు. ఐర్లాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ భారీ వర్షంతో రద్దయ్యింది. దీనిపై సల్మాన్ చాలా ప్రశాంతంగా స్పందించాడు. “వాతావరణం మన చేతుల్లో లేదు. మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం వృథా. మాకు ఉన్న మూడు మ్యాచ్లు ఎలా గెలవాలి అన్నదానిపైనే దృష్టి పెడతాం” అని అన్నాడు. ఇటీవలి కాలంలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్లలో క్రికెట్ కంటే బయటి విషయాల గురించే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “మేం క్రీడాకారులం. క్రికెట్ ఆడటానికి, క్రికెట్ గురించే మాట్లాడటానికి వచ్చాం. ఈ విషయాలు అంతవరకే ఉండాలి. మేము వీటిని మన ఆటపై ప్రభావం చూపనివ్వం” అని చెప్పాడు.
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!