RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది
- తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డి అన్నీ అయ్యాడు
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు : ఆర్ ఎస్ ప్రవీణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RS Praveen Kumar : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “పారదర్శకంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు వారి కుటుంబ సభ్యులే సూచించాలి. అక్రమ ఆదేశాలు పాటిస్తున్న అధికారులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు.
Also Read
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
సచివాలయంలో రేవంత్ రెడ్డి సైబర్ పెట్రోలింగ్ చేయాలని సవాల్ విసిరారు. “ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే సచివాలయంలో ఫైల్స్ కదులుతున్నాయి” అని ఆరోపించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఒకేరోజు 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వెల్లడించారు. “సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి రాజకీయ అవసరాలకు వాడుతున్నారు” అని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ సైన్యం పేరుతో కేటీఆర్ను ట్రోల్ చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలను ట్రోల్ చేస్తున్నారు, అయితే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, కానీ బీజేపీపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు” అని విమర్శించారు.
“హరీష్ రావును పెట్రోల్తో కాల్చుతానని మైనంపల్లి హనుమంతరావు అన్నా, కానీ ఆయనపై కనీసం కేసు పెట్టలేదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కాల్చుతానంటే అది ఎలా సివిల్ కేసుగా మారుతుంది?” అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
-
Purity of Wheat Floor: మీరు వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైనదేనా? ఈ 3 చిట్కాలతో వెంటనే తెలుసుకోవచ్చు!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!