RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది
- తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డి అన్నీ అయ్యాడు
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు : ఆర్ ఎస్ ప్రవీణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RS Praveen Kumar : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “పారదర్శకంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు వారి కుటుంబ సభ్యులే సూచించాలి. అక్రమ ఆదేశాలు పాటిస్తున్న అధికారులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
సచివాలయంలో రేవంత్ రెడ్డి సైబర్ పెట్రోలింగ్ చేయాలని సవాల్ విసిరారు. “ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే సచివాలయంలో ఫైల్స్ కదులుతున్నాయి” అని ఆరోపించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఒకేరోజు 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వెల్లడించారు. “సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి రాజకీయ అవసరాలకు వాడుతున్నారు” అని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ సైన్యం పేరుతో కేటీఆర్ను ట్రోల్ చేస్తున్న వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతలను ట్రోల్ చేస్తున్నారు, అయితే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, కానీ బీజేపీపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు” అని విమర్శించారు.
“హరీష్ రావును పెట్రోల్తో కాల్చుతానని మైనంపల్లి హనుమంతరావు అన్నా, కానీ ఆయనపై కనీసం కేసు పెట్టలేదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కాల్చుతానంటే అది ఎలా సివిల్ కేసుగా మారుతుంది?” అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!