Home
Telangana Government
Telangana Government News
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (LTMRHL)కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు… -
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
CM Revanth Reddy: న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ… -
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీల ద్వారా తన పరిపాలనా శైలిని స్పష్టం చేస్తూ, ‘క్యారెట్ అండ్ స్టిక్’ (Carrot and Stick) విధానాన్ని పక్కాగా అమలు చేశారు. అంటే.. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు (మంచి పోస్టింగ్స్), నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి శిక్ష (లూప్ లైన్ పోస్టింగ్స్) అనే సంకేతాన్ని పంపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… -
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఒక భారీ మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను సుమారు రూ. 15 వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముగించింది. దీనికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన… -
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ కోల్పోయామని బాధపడుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. “కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైనా చేస్తారని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. కానీ, వీళ్లు ఒక్కటంటే ఒక్కటైనా నిర్మాణాత్మకమైన పని చేశారా?” అని… -
Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు , పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాను స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చైర్మన్ అనిల్ జైన్తో భేటీ అయిన మంత్రి, ప్రాజెక్టు తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. Muslim Population:… -
OTR: ప్రభుత్వం టార్గెట్గా పొలిటికల్ హీట్ పెంచుతున్న ప్రతిపక్షం..!
OTR: పొలిటికల్ పిడుగులు పడుతున్నా.. పెదవి విప్పరు. ఆరోపణల ఉరుములు ఉరుముతున్నా.. అణు మాత్రం కూడా స్పందించరు. అసలు అనేది నన్ను కాదుకదా… అన్న ధోరణి పెరిగిపోతోంది. తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్ చేసుకోవడం లేదా? అందుకే ప్రతిపక్షం అనేది నన్నుకాదుకదా…. నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి కౌంటర్స్ వేయమని మంత్రులకు ముల్లుగర్రలు పెట్టి పొడిచి చెప్పాల్నా? తెలంగాణ కేబినెట్లో అసలేం జరుగుతోంది? సమ్మర్ సెగలతో పాటే తెలంగాణలో… -
CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 6న బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.225 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం కాగా, ఆలయాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని… -
CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!
హైదరాబాద్ నగరానికే తలమానికమైన హుస్సేన్ సాగర్ సాక్షిగా ఎంతో మంది ప్రాణాలను కాపాడి, తన పేరుకంటే ‘ట్యాంక్ బండ్ శివ’గానే సుపరిచితుడైన ఒక సామాన్య హీరోకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆపదలో ఉన్న వందలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన శివ, ప్రస్తుతం సరైన ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శివ తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని… -
Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డెట్..
తెలంగాణ రాష్ట్రంలో ఇంధన సరఫరాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజా నివేదికను విడుదల చేసింది. మార్చి 27, 2026 నాటి అధికారిక గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు డిమాండ్ కంటే అత్యధికంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ అవసరమయ్యే ఇంధన పరిమాణం కంటే మార్చి 26వ తేదీన జరిగిన సరఫరా దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది రవాణా రంగం , సామాన్య వినియోగదారులకు…
తాజావార్తలు
-
Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
-
Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!