Uttam Kumar Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ కేబినెట్ విస్తరణకు సిద్ధం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - గవర్నర్ భేటీ
- కొత్త మంత్రుల ఎంపికపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్లో చేరే అవకాశముందని తెలుస్తోంది.
ఇక, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సోమవారం తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను ప్రారంభించిన ఆయన, కేబినెట్ విస్తరణపై మీడియా ప్రశ్నించగా, తనకు ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణను అధిష్టానం ఖరారు చేసిన వేళ, స్వయంగా ఓ మంత్రి దీనిపై అవగాహన లేదని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
కొత్తగా మంత్రివర్గంలోకి చేరే నేతల విషయానికొస్తే, కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు నలుగురికి అవకాశం లభించే అవకాశముంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, తుది నిర్ణయానికి ముందు వీరి జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయా? లేక హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులను ప్రకటిస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇక, కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించే విషయంలో భౌగోళిక సమతుల్యత పాటించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా సమతుల్యతను పాటిస్తూ, సామాజిక సమూహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కొంతకాలంగా మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తున్న పలువురు సీనియర్ నేతలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
RK Roja: కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..!
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!