HCU: 1973 లో 2300 ఎకరాల్లో హెచ్సీయూ ఏర్పాటు.. ఆ 400 ఎకరాలు ఎవరిది?
- గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్సీయూకి చెందిన 40 ఎకరాలు
- స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఐఎంజీ భారత్ అనే సంస్థ తో ఒప్పందం
- హెచ్సీయూ ల్యాండ్ లో నుంచి మరో 400 ఎకరాలు కేటాయింపు
- ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు. అనంతరం.. గోపన్పల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమెంటల్ రీసెర్చ్, ఎనిమల్ బయో టెక్నాలజీ రీసెర్చ్ కోసం 250 ఎకరాలు మంజూరు చేశారు. ఇదే భూమిలో టీఎన్జీవో (TNGO) కాలనీల కోసం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
READ MORE: Meerut Murder Case: కానిస్టేబుల్కు నిందితురాలు ముస్కాన్ ముద్దు.. వైరల్ వీడియోపై అధికారుల సీరియస్
Also Read
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
అయితే, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఐఎంజీ భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని రాజశేఖర్రెడ్డి హయాంలోని ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. IMG భారత్ సంస్థ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు ఐఎంజీ భారత్కు వ్యతిరేకంగా వచ్చింది. టెండర్లు రద్దు చేయడం సరైన నిర్ణయమేనని కోర్టు వెల్లడించింది. ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని నిరసిస్తూ హచ్సీయూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు.
READ MORE: Akhilesh Yadav: యూపీలో ఈద్ ప్రార్థనలపై గందరగోళం.. అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే?
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?