Team India: టీ20 వరల్డ్కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
- నేటి నుంచి స్టార్ట్ కానున్న టీ20 వరల్డ్ కప్..
- వరల్డ్కప్ కి ముందు భారత జట్టులో భారీ మార్పులు..
- హర్షిత్ రాణా స్థానంలో తుది జట్టులోకి మియాభాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీ20 వరల్డ్కప్ 2026 ఈరోజు ( ఫిబ్రవరి 7న) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. యువ పేసర్ హర్షిత్ రాణా టీం నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన వార్మ్- అప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో మోకాలికి గాయం అయినట్లు బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. నవీ ముంబైలో జరిగిన ఆ మ్యాచ్లో హర్షిత్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయానికి సంబంధించిన స్కాన్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల సలహా తర్వాత హర్షిత్ టోర్నీలో పాల్గొనటం లేదని బీసీసీఐ వైద్య బృందం తేల్చి చెప్పింది. అతని స్థానంలో డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ ని తుది భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
Read Also: T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
వాషింగ్టన్ సుందర్పై రాకపై నో అప్డేట్:
ఇక, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు అని బీసీసీఐ చెప్పుకొచ్చింది. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. టీ20 వరల్డ్కప్ ముందు జరిగిన ఐసీసీ అధికారిక ఫోటోషూట్కు కూడా సుందర్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే తుది జట్టులో చేరతాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉందన్నాడు.
Read Also: Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!
ఓపెనింగ్ జోడీ ఫిక్స్:
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజు శాంసన్ బెంచ్కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్కు ముందు సంజు శాంసన్ నెట్స్లో కూడా బ్యాటింగ్ చేయలేదని తెలుస్తుంది.
టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!