Toxic Alcohol: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరుణాపురంలో నాటు సారా ఘటనలో ఇవాళ్టి వరకు మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరుకుందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి పేర్కొన్నారు.
Siddaramaiah: కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కన్నడిగుడిపై ఉందని, రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.
Kallakurichi Illicit Liquor: తమిళనాడు రాష్ట్రంలో కల్తీసారా ఘటన అత్యంత విషాదం గా మారింది. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో ఇప్పటి వరకు 29 మందికి చేరింది మృతుల సంఖ్య.. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులో విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. ఇంకా వివిధ ఆసుపత్రిలో చికిత్స 40 మంది చికిత్స పొందుతున్నారు. మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ…
Tamil Nadu Sasikala : తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చేరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలోకి తన పునరాగమనం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. 2026 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు. ప్రతిపక్ష నేతగా కె. పళని స్వామి అడగాల్సిన ప్రశ్నలను ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగడం…
కులాంతర వివాహం జరిపించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPIM) కార్యాలయంలో చోటు చేసుకుంది. జూన్ 13వ తేదీన వివాహం చేసుకున్న వివిధ కులాలకు చెందిన యువ జంటకు మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించాకె. ఈ క్రమంలో.. పార్టీ కార్యాలయంతో పాటు, ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు…
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్మెన్ రాజ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ…
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.