Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ, ఐదుగురు దుర్మరణం
- తమిళనాడులో ఘోర ప్రమాదం
- బస్సు-ట్రక్కు ఢీ.. ఐదుగురు దుర్మరణం
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు
- తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష
- స్వల్పగాయాలైన వారికి రూ.50000 చొప్పున నష్టపరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Read Also: International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఓ ట్రక్కు వెనుక రెండు బైక్లపై ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకరైన లక్ష్మణన్ తన భార్య, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మురుగన్ అనే మరో వ్యక్తి తన భార్య, 11 నెలల కొడుకుతో బైక్ పై వెళ్తున్నాడు. అయితే ముందు స్పీడ్ బ్రేకర్ రాగానే.. లారీ డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. బైకర్లు కూడా లారీ వేగం తగ్గించడం చూసి.. వారు వేగం తగ్గించారు. అయితే వెనుకాల వస్తున్న ప్రైవేట్ బస్సు వారిని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Tragedy : కాంపౌండ్ వాల్ కూలి ముగ్గురు కూలీలు మృతి
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ రమేష్ పరారీలో ఉన్నాడు. మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!