లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ను కొందరు దుండగులు దారుణంగా నరికి హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ విషయాన్ని చెన్నై అదనపు కమిషనర్(నార్త్) అస్రా గార్గ్ వెల్లడించారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార డీఎంకేలో రాజీనామాల పర్వం పొలిటికల్గా ఆసక్తి రేపింది. కోయంబత్తూరు, తిరునల్వేలి మేయర్లు రాజీనామా చేశారు.
Thief Leaves Letter : తాజాగా తమిళనాడు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్ నివాసంలో దొంగ దోచుకున్నాడు. అయితే., దొంగిలించిన వస్తువులను ఒక నెలలో తిరిగి ఇస్తానని హామీ ఇస్తూ క్షమాపణ లెటర్ రాసి పెట్టి దొంగతనం చేసాడు. విశ్రాంత ఉపాధ్యాయులు అయిన సెల్విన్, అతని భార్య జూన్ 17న చెన్నైలో తమ కుమారుడిని కలవడానికి బయలుదేరినప్పుడు మేగ్నానపురంలోని సాతంకుళంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దంపతులు లేని సమయంలో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇంటి పనిమనిషి…
Annamalai: బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై పదవీ కాలం జూలై 17తో ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్నామలై కొన్ని రోజుల పాటు రాజకీయాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Pani Puri: పానీపూరీ లవర్స్ కు బిగ్ తగిలే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో పానీపూరీని బంద్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
Kallakurichi tragedy: ఇటీవల తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 60 మందికి పైగా మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే జిల్లాలో ఇంత మంది చనిపోవడంపై అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్పై బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్లో పేలుగు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.